అన్వేషించండి

Dharmavaram Assembly Constituency: నేటి నుంచి ధర్మవరంలో సత్యకుమార్ ప్రచారం- రాక్షస కబంధహస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకుందామని నినాదం

Andhra Pradesh Elections 2024: ధర్మవరంలో నేటి నుంచి ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ ప్రచారం ప్రారంభించనున్నారు. నిన్న అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.

Anantapur News: నేటి నుంచి ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ (Satya Kumar) ప్రచారం చేయనున్నారు. బుధవారం అనంతపురం జిల్లాకు చేరుకున్న ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ని స్వాగతం పలికిన వారిలో టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ (Parital Sriram), మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ నివాసంలోనే కూటమి నేతల సమన్వయ సమావేశం జరిగింది. 

శాంతి, అహింస కోరుకునే ధర్మవరాన్ని ఒక అధర్మవరంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) మార్చేశారని సత్యకుమార్ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని పరిటాల శ్రీరామ్ స్వగృహంలో ఆయన బిజెపి, టిడిపి నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని పలు అంశాల గురించి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను బిజెపి జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పని చేశానని చెప్పారు. అలాగే వివిధ శాఖల ఓఎస్డిగా ఎంతో పాలన అనుభవం కూడా ఉందని అన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ధర్మవరం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. పరిటాల శ్రీరామ్ ఇతర నాయకుల సహకారంతో ఇక్కడ కచ్చితంగా విజయం సాధిస్తానన్నారు. 

గడిచిన ఐదేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మట్టి దోపిడీ చేస్తుంటే.. ఇక్కడ మాత్రం పంచభూతాలను కూడా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చెరువుని కబ్జా చేసి ఒక విలాసవంతమైన ఇల్లు నిర్మించుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని సత్యకుమార్ విమర్శలు చేశారు. ప్రతిదానికి ఒక ప్యాకేజీ నిర్ణయించి.. ఇక్కడ ప్రజలను పట్టిపీడిస్తున్న పాలకులను పారద్రోలుదామని ఆయన పిలుపునిచ్చారు. ధర్మవరాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది ఒక దృక్పథంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో తొలిసారి ఒక బీసీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారని ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ అన్ని అంశాల గురించి ఆయన తెలుసుకున్నారు అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అభివృద్ధి ఎలా చేయాలన్నది ఒకపక్కా ప్రణాళికతో ఆయన ఉన్నారని అన్నారు. ఒక జాతీయ నాయకుడు ధర్మవరానికి రావడం సంతోషంగా ఉందని.. సత్య కుమార్ ద్వారా ధర్మవరంలో అనేక సమస్యలు పరిష్కరించుకునే వీలు ఉందని అన్నారు. ధర్మవరానికి సత్య కుమార్ తొలిసారి వస్తున్నారని ఈ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget