అన్వేషించండి

Dharmavaram Assembly Constituency: నేటి నుంచి ధర్మవరంలో సత్యకుమార్ ప్రచారం- రాక్షస కబంధహస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకుందామని నినాదం

Andhra Pradesh Elections 2024: ధర్మవరంలో నేటి నుంచి ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ ప్రచారం ప్రారంభించనున్నారు. నిన్న అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.

Anantapur News: నేటి నుంచి ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ (Satya Kumar) ప్రచారం చేయనున్నారు. బుధవారం అనంతపురం జిల్లాకు చేరుకున్న ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ని స్వాగతం పలికిన వారిలో టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ (Parital Sriram), మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ నివాసంలోనే కూటమి నేతల సమన్వయ సమావేశం జరిగింది. 

శాంతి, అహింస కోరుకునే ధర్మవరాన్ని ఒక అధర్మవరంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) మార్చేశారని సత్యకుమార్ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని పరిటాల శ్రీరామ్ స్వగృహంలో ఆయన బిజెపి, టిడిపి నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని పలు అంశాల గురించి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను బిజెపి జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పని చేశానని చెప్పారు. అలాగే వివిధ శాఖల ఓఎస్డిగా ఎంతో పాలన అనుభవం కూడా ఉందని అన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ధర్మవరం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. పరిటాల శ్రీరామ్ ఇతర నాయకుల సహకారంతో ఇక్కడ కచ్చితంగా విజయం సాధిస్తానన్నారు. 

గడిచిన ఐదేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మట్టి దోపిడీ చేస్తుంటే.. ఇక్కడ మాత్రం పంచభూతాలను కూడా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చెరువుని కబ్జా చేసి ఒక విలాసవంతమైన ఇల్లు నిర్మించుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని సత్యకుమార్ విమర్శలు చేశారు. ప్రతిదానికి ఒక ప్యాకేజీ నిర్ణయించి.. ఇక్కడ ప్రజలను పట్టిపీడిస్తున్న పాలకులను పారద్రోలుదామని ఆయన పిలుపునిచ్చారు. ధర్మవరాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది ఒక దృక్పథంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో తొలిసారి ఒక బీసీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారని ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ అన్ని అంశాల గురించి ఆయన తెలుసుకున్నారు అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అభివృద్ధి ఎలా చేయాలన్నది ఒకపక్కా ప్రణాళికతో ఆయన ఉన్నారని అన్నారు. ఒక జాతీయ నాయకుడు ధర్మవరానికి రావడం సంతోషంగా ఉందని.. సత్య కుమార్ ద్వారా ధర్మవరంలో అనేక సమస్యలు పరిష్కరించుకునే వీలు ఉందని అన్నారు. ధర్మవరానికి సత్య కుమార్ తొలిసారి వస్తున్నారని ఈ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget