అన్వేషించండి

MLC Elections: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ - క్షణక్షణ ఉత్కంఠ, విజేత ఎవరో?

Telangana News: నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు.

Nalgonda Khammam Warangala MLC Elections Results: తెలంగాణలో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నికల ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో నిలిచారు. అటు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ముగిసే సరికి తీన్మార్ మల్లన్న.. రాకేశ్ రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన 4 రౌండ్లలో కలిపి తీన్మార్ మల్లన్నకు 1,23,368 ఓట్లు రాగా.. రాకేశ్ రెడ్డికి 1,04,630 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 43,541 ఓట్లు, మరో అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ 29,844 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. గురువారం రాత్రికి మొదటి ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. గెలుపు కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు ఎక్కువ)గా పరిగణించే ఓట్లు 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు అధికారులు రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు చేపట్టారు. కాగా, తీన్మార్ మల్లన్న గెలవాలంటే 31,727 ఓట్లు, రాకేశ్ రెడ్డికి 50,465 ఓట్లు కావాలి. అటు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోకు కుమార్ ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. అశోక్ కుమార్ నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంది.

తీవ్ర ఉత్కంఠ

ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో భాగంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో ప్రయారిటీతో కలిసి 18,962 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. ఆయన గెలిచేందుకు ఇంకా 31,885 ఓట్లు కావాలి. అటు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలిచేందుకు 50,581 ఓట్లు కావాలి. రెండో ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్‌కు ఇప్పటివరకూ 397 ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 266 వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

అసలేంటీ ఎలిమినేషన్ ప్రక్రియ.?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతలో గెలుపు కోటాకు సరిపడా ఓట్లు ఏ అభర్థికీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయిస్తారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్య ఓట్లు అతి తక్కువగా వచ్చిన వారిని తొలుత గుర్తిస్తారు. వారి బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వచ్చిందో వాటిని ఆ అభ్యర్థికి జమ చేస్తారు. అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి క్రమ పద్ధతిలో తప్పిస్తారు. దీన్ని ఎలిమినేషన్ ప్రక్రియ అంటారు. రిటర్నింగ్ అధికారి సూచన మేరకు అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో జాబితాను తయారుచేశారు. వారందరికీ సమాచారం ఇచ్చి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు.

భారీగా చెల్లని ఓట్లు

ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా.. 25,824 ఓట్లను చెల్లనవిగా  అధికారులు నిర్ధారించారు. వీటిలో తొలి 3 స్థానాల్లో ఉన్న వారివే ఎక్కువగా ఉన్నాయి. తొలి రెండు రౌండ్లలోనేే 15,126 ఓట్లు చెల్లకుండా పోయాయి. చాలామంది ఓటర్లు నచ్చిన అభ్యర్థి పక్కన గడిలో నెంబర్లు వేయాల్సి ఉండగా.. రైట్ మార్క్ చేయడం, అభ్యర్థి ఫోటోపై సంతకం, ప్రాధాన్యతను తెలిపే సంకేతాన్ని తెలుగు, ఆంగ్లంలో రాయడం, కొన్నిచోట్ల 'జై తెలంగాణ', 'జై కాంగ్రెస్' వంటి నినాదాలు రాయడంతో ఎక్కువ ఓట్లు చెల్లకుండా పోయాయి. 

Also Read: Wishesh to Pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ-జనసేనాని రియాక్షన్‌ ఇదే..

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
India Israel FTA: ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Andhra Pradesh Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 
Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?
రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?
Embed widget