అన్వేషించండి

Mahasena Media On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం - మహాసేన రాజేష్ రివర్స్ !

Andhra Politics : పవన్ కల్యాణ్ ను ఓడించాలని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో అమాయకులపై దాడి చేసే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ చెప్పారన్నారు.

Elections 2024 :  జనసేన పార్టీకి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని మహాసేన రాజేష్ ప్రకటించారు. పవన్ కల్యాణ్త్ తో పోలిస్తే  మా వర్గాలకు జగన్ బెటరని అనిపిస్తుందని.. వీళ్లిద్దరి కన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటరని అన్నారు. కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా  సరే వారికీ  వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ చెప్పానన్నారు. పవన్ కల్యాణ్ వలన జరిగే అనర్ధాలకు ప్రజలకు తెలియచేస్తామన్నారు. ఇప్పటికే చాలా సహించామని జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా  పని చేస్తామన్నారు. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదన్నారు. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున  పోరాడటమే తమకు ఇష్టమన్నారు. నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేమన్నారు.
Mahasena Media On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం - మహాసేన రాజేష్ రివర్స్ !

ఇదే అంశంపై మహాసేన రాజేష్ వీడియో చేశారు. యూట్యూబ్ లో వీడియో చేశారు. గతంలో తనను తాను జన సైనికుడిగా ప్రకటించుకున్నానన్నారు. అయినా ఒక్కరు కూడా వచ్చి తననుపార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. అయినా జనసేన కోసం పని చేసినా స్పందించలేదన్నారు. జనసేన కోసం పని చేసిన దళిత నేతల్ని కూడా పవన్ పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గన్నవరంలోనే పోటీ చేయడానికి చాన్స్ ఇస్తే అడ్డుకున్నారన్నారు. పోటీ నుంచి వైదొలికిన తర్వాత .. కూటమి కోసం తాను ప్రచారం చేస్తున్నానని.. అయినా తన సమావేశాలకు ఒక్క సారి కూడా పవన్ రాలేదన్నారు. మహాసేన సమావేశాలకు పవన్ రాలేదన్నారు.            

అలాగే పవన్ కల్యాణ్ మోదీ పాల్గొన్న సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మహాసేన రాజేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ మూడొంతుల మెజార్టీ సాధించేందుకు ప్రాణత్యాగం చేస్తానని పవన్ చెప్పానని అది కరెక్ట్ కాదన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పై జగన్ హీరోలా స్పందించారన్నారు. నిజానికి బీజేపీకి మూడొంతుల మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని రాజేష్ అన్నారు. కానీ తాను బతికున్నంత వరకూ రిజర్వేషన్ల జోలికి ఎవరూ రాలేరని మోదీ ప్రకటించారు. కావాలని విమర్శించడానికి రాజేష్ ఇలా వీడియో చేశారన్న అభిప్రాయం వినపిస్తోంది.                                                      

మహాసేన రాజేష్ కు.. టీడీపీ పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చింది. తర్వాత జనసేన పార్టీ అభ్యరంతరాలతో ఆ సీటు మహాసేన రాజేష్ తీసుకుంది. అమలాపురం తీసుకోవాల్సిన జనసేన.. తనకు సీటు లేకుండా చేయడానికే పట్టుబట్టి పి.గన్నవరం తీసుకుందని రాజేష్ భావిస్తున్నారు. ఆ కోపంతో పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యతిరేక చూపిస్తున్నట్లుగా భావిస్తున్నారు.  గతంలోనూ మహాసేన తరపున ఇండిపెడెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించారు. తర్వాత విరమించుకున్నారు. కూటమి తరపున ప్రచారం చేస్తామన్నారు. మళ్లీ ఇప్పుడు  రివర్స్ అవుతున్నారు. మహాసేన వ్యవహారం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.                   

        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget