అన్వేషించండి

Andhra Politics: గేదెల శ్రీనుబాబు పయనమెటు- టీడీపీ నేతలతో చర్చలు దేనికి సంకేతం?

Gedela Srinubabu News: ఉత్తరాంధ్రకు చెందిన పారిశ్రామిక వేత్త గేదెల శ్రీనుబాబు రాజకీయ అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. టీడీపీలో చేరాలని గేదెల శ్రీనుబాబు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

Gedela Srinubabu likely to Join TDP: ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్సస్‌ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు రాజకీయ అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటికీ రైతు, యువత పేరుతో సదస్సులు నిర్వహిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలు, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై త నకు విజన్‌ను వివరిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి శ్రీనుబాబు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా యాక్టివ్‌ కావాలన్న కోరికను అనేక చోట్ల బయటపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గాని చెందిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena Party) నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, చివరి నిమిషంలో వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ ప్రకటించిన ఎంవీవీ సత్యనారాయణకు మద్ధతు ప్రకటించారు.

వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తోంది. కానీ, శ్రీనుబాబుకు ఆ పార్టీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ప్రధాన్యతను ఇవ్వలేదు. ఆయన కూడా పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఇన్నేళ్లు ఉంటూ వచ్చారు. మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన యాక్టివ్‌ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు సభలు,ర సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళతారన్న జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. 

టీడీపీ నేతలతో వరుస భేటీలు 
టీడీపీలో చేరాలని గేదెల శ్రీనుబాబు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన టీడీపీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. శంఖారావం సభల్లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీనుబాబు వెళ్లి కలిశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావుతోపాటు బొబ్బిలిలో బేబీ నాయనతోపాటు పలువురు కీలక నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారితో రాజకీయపరమైన అంశాలను చర్చించినప్పటికీ వాటిని బయట పెట్టడం లేదు. టీడీపీలో చేరే క్రమంలోనే శ్రీనుబాబు ఆ పార్టీ నేతలతో సమావేశమవుతున్నట్టు చెబుతున్నారు. ఆయన కానీ, ఆయన అనుచరులు కానీ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పడం లేదు. 

విజయనగరం ఎంపీగా బరిలోకి దిగుతారా.. 
పల్సస్‌ సంస్థ అధినేతగా, యువతకు ఉపాధి కల్పించిన వ్యక్తి, తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంత ప్రజలకు గేదెల శ్రీనుబాబు సుపరిచితులు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించలేకపోయారు. రానున్న ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్‌ స్థానానికి బరిలో దిగేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం పార్లమెంట్‌ (Vizianagaram Parliament) స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలతో గేదెల శ్రీనుబాబు వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బలమైన వ్యక్తి కోసం ఇక్కడ అన్వేషిస్తోంది. పార్టీ నుంచి సానుకూల స్పందన వస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs GT Match Highlights IPL 2025 | కోల్ కతా నైట్ రైడర్స్ పై 39 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ | ABP DesamPM Modi receives US Vice President JD Vance Family | అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP Desa

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
PM Modi-JD Vance Meeting: ఈ ఏడాది చివరిలో ఇండియాకు డొనాల్డ్ ట్రంప్‌- మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
ఈ ఏడాది చివరిలో ఇండియాకు డొనాల్డ్ ట్రంప్‌- మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
AI Effect On Middle Class: హలో మధ్యతరగతి మాష్టారు ఇది మీ కోసమే! త్వరలో మీరు రోడ్డున పడబోతున్నారు! మీకు అర్థమవుతుందా!
హలో మధ్యతరగతి మాష్టారు ఇది మీ కోసమే! త్వరలో మీరు రోడ్డున పడబోతున్నారు! మీకు అర్థమవుతుందా!
Free online DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా
రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్‌" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Embed widget