అన్వేషించండి

యాక్టివ్ రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప.. కాంగ్రెస్ లో చేరిక..!

Andhra Pradesh Politics: పదేళ్ల తర్వాత యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలె ముత్యాలపాప సిద్ధపడుతున్నారు. జిల్లా పర్యటనకు రానున్న షర్మిల సమక్షంలో చేరనున్నారు.

Former MLA Mutyalapapa Joins To Congress : పదేళ్ల తర్వాత యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప సిద్ధపడుతున్నారు. రెండు రోజుల్లో ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు రానున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల సమక్షంలో చేరనున్నారు. నర్సీపట్నంలో షర్మిల రచ్చబండ కార్యక్రమం తరువాత కాంగ్రెస్ లో తిరిగి చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో బోళెం ఫ్యామిలీని పిలిచి మరీ నర్సీపట్నం అసెంబ్లీ స్థానాన్ని నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కేటాయించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ముత్యాల పాప కుటుంబం ఆ తరువాత జరిగిన పరిణామాలతో 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినప్పటికీ ఆమెకు సముచిత స్థానం గౌరవం ఇవ్వకపోవడంతో.. పార్టీ పట్ల అంటీ ముట్టనట్టుగానే ఆమె వ్యవహరిస్తూ వస్తున్నారు. గడిచిన 10 ఏళ్ల నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. పార్టీ ఆమె సేవలను పెద్దగా వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లడం మంచిదని భావించిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.  

కాంగ్రెస్ లో చేరనున్న ముత్యాల పాప 

రాజకీయంగా గుర్తింపునిచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముత్యాల పాప కుటుంబం రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తనయ వైఎస్ షర్మిల మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ముత్యాల పాప కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. నర్సీపట్నంలో కీలకంగా వ్యవహరించే కొంతమంది నేతల సహాయంతోనే ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. తనతో పాటు భారీ ఎత్తున అనుచరులతో పార్టీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

నర్సీపట్నంలో తప్పని త్రిముఖపోటీ...

మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప కాంగ్రెస్ పార్టీలో చేరితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీన నర్సీపట్నం వస్తున్న పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ముత్యాల పాపా చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి తన రాజకీయ కార్యక్రమాలను విస్తరించినట్లు చెబుతున్నారు. సౌమ్యురాలుగా పేరు ఉన్న ఆమెకు స్థానికంగా రాజకీయాలను శాసించే కొంతమంది నేతల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. వారు పూర్తిస్థాయిలో ఈమెకు సహకారాన్ని అందిస్తే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈమె బరిలో ఉండే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అదే జరిగితే నర్సీపట్నంలో త్రిముఖ పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుని ఈమె ఢీకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ముత్యాల పాప కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉండేందుకు స్థానిక వైసీపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అవి ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget