అన్వేషించండి

Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు - నెరవేరనున్న నిరుద్యోగుల కల, తొలి సంతకం దానిపైనే!

Andhrapradesh News: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత తొలి సంతకం దేనిపై అన్నదానిపైనే ఇప్పుడు అందరి చూపూ ఉంది. హామీ ఇచ్చిన విధంగానే ఆయన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉండనుంది.

Chandrababu First Signature On Mega Dsc: డీఎస్సీ.. లక్షలాది మంది నిరుద్యోగుల కల. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని ప్రతి ఒక్క యువత కోరుకుంటారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అడుగులు పడబోతున్నాయి. నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులను ఆకర్షించేలా.. అభివృద్ధి, ఉపాధి వంటివే ధ్యేయంగా.. కూటమి తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న ఏపీ సీఎంగా అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హామీలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అయితే, ఆయన తొలి సంతకం చేయబోయే ఫైల్‌పై అంతటా ఉత్కంఠ నెలకొంది.

ఫస్ట్ సైన్.. మెగా డీఎస్సీ

అవును.. ఫస్ట్ సైన్ మెగా డీఎస్సీపైనే. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తొలి సంతకం డీఎస్సీపైనే అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వెనువెంటనే టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని యత్నించింది. అయితే, నిరుద్యోగులు తగినంత సమయం ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికిషేన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ఎక్కువగా కూటమి వైపు మొగ్గు చూపారన్నది విశ్లేషకుల మాట. కూటమి అఖండ విజయంతో ఇక నిరుద్యోగుల కల.. మెగా డీఎస్సీకి మార్గం సుగమం అవుతోందని చెబుతున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేయనుండగా.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించి సంపద సృష్టించి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు.

రెండో సైన్.. దేనిపై అంటే.?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఎన్నికలకు ముందు ఇంతలా చర్చనీయాంశమైన అంశం మరొకటి లేదు. భూహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం భూముల్ని లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్న కూటమి నేతల వాదనలతో గ్రామీణ, అర్బన్ ఓటర్లు ఏకీభవించారు. అంతేకాకుండా ల్యాండ్ పాస్ బుక్‌పై అప్పటి సీఎం జగన్ ఫోటో ఉండడంపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండో సంతకం దానిపైనే చేస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సైన్ చేయనున్నారు.

మూడో సైన్.. పెరగనున్న పింఛన్

పెన్షన్.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వంటి వారికి ప్రభుత్వం నెలా నెలా అందించే లబ్ధి. వైసీపీ అధినేత జగన్ హయాంలో రూ.2 వేల నుంచి దశలవారీగా రూ.3 వేలకు పెంచారు. ఈ క్రమంలో పెన్షనర్లకు ఊరటగా అధికారంలోకి రాగానే.. పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెరిగిన పెన్షన్‌ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపుపైనే మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరనుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget