అన్వేషించండి

Bjp News: తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశం, తొలి జాబితాలోనే సగం సీట్లు ఖరారు

BJP MP Seats: తెంలగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు, నేడు అమిత్ షాతో చర్చించనున్న రాష్ట్ర నేతలు

BJP NEWS: తెలంగాణ (Telangana)అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లాపడిన బీజేపీ(BJP) కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకునేందుకు  తీవ్రంగా కష్టపడుతోంది. కొత్త సీట్ల సంగతి ఎలా ఉన్నా ఉన్నవాటిని కాపాడుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే విజయసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా  ఆపార్టీ ప్రచార రథాలు పరుగులెడుతుండగా...అభ్యర్థుల ఎంపికపై కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది.అభ్యర్థుల జాబితా ఇప్పటికే సిద్ధం కాగా..వీటిపై చర్చించేందుకు నేడు తెలంగాణ నేతలతో అమిత్ షా(Amith Sha) కీలక భేటీ నిర్వహించనున్నారు. 

బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి చివరి నిమిషం వరకు అభ్యర్థులను తేల్చకపోవడమూ ఓ కారణమని బీజేపీ(BJP) భావిస్తోంది. అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో...ప్రచారానికి ఎక్కవు సమయం లేకుండా పోయిందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ముందుగానే ప్రకటించేందుకు  కమలదళం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన రాష్ట్ర నాయకత్వం లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఢిల్లీ(Delhi)కి పంపింది.  ముందుగానే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది. ఢిల్లీ అధిష్టానం ఈ ఆశావహుల జాబితాపై చర్చించేందుకు  రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించింది.
బలబలాలేంటి
ఢిల్లీలో నేడు తెలంగాణ(Telangana) నేతతలో కేంద్రమంత్రి అమిత్ షా(Amith Sha) కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర నాయకత్వం పంపిన ఆశావహుల జాబితాపై చర్చించనున్నారు. అభ్యర్థుల బలబాలాలు, సామాజిక వర్గం, ఆర్థికస్థితిగతులు, పార్టీ పరంగా ఉన్న కమిట్ మెంట్ అన్ని అంశాలపైనా చర్చించనున్నారు. 

అమిత్ షా నివాసంలో జరిగే ఈ భేటీలో  బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా (J.P.Nadda)కూడా పాల్గొననున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay),  పార్లమెంటరీ బోర్డు సభ్యులు  లక్ష్మణ్, తెలంగాణ ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ వారితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈటల రాజేందర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లు
గత పార్లమెంట్ ఎన్నికల సమయానికి తెలంగాణలో బీజేపీ అంత బలంగా లేకున్నప్పటికీ అనూహ్యంగా  4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. దీంతో తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులజాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఆశావహుల పేర్లు కేంద్ర అధినాయకత్వానికి  చేరగా....నేడు జరిగే సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్లతో జాబితా రూపొందించనున్నారు. వచ్చేవారంలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి వారిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు. ఈ సమావేశంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. వాటిల్లో తెలంగాణ నుంచి సగానికి పైగా అభ్యర్థులు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేసేలా బీజీపే రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణలో అభ్యర్థుల తరపున ఢిల్లీ పెద్దలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget