అన్వేషించండి

Election campaign: సాయంత్రం తర్వాత మూగబోనున్న మైకులు-6గంటల వరకే ప్రచారానికి గడువు

Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత మైకులన్నీ మూగబోతాయి. మే 13న పోలింగ్‌ జరగనుంది.

Election campaign End Today In Andhra Pradesh And Telangana :తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెల రోజులుగా మారుమోగుతున్న మైకులు మూగబోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో హోరెత్తిన ప్రచారం... ముగింపు దశకు చేరుకుంది. ర్యాలీలు, సభలు, అభిమాన నేతలను కీర్తిస్తూ పాడిన పాటలు, నినాదాలు... సాయంత్రం 6గంటల తర్వాత ఇక వినిపించవు. ఏపీ, తెలంగాణలో... ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడం... సాయంత్రం 6గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో... రాజకీయ పార్టీల నేతలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రచారానికి ఇంకొన్ని గంటలే సమయం ఉండటంతో... ఓటర్ల దగ్గరకు వెళ్లి... తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సాయంత్రం లోపే ప్రచారం ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నాలుగో దశ పోలింగ్‌ జరుగుతున్న రాష్ట్రాల్లోనూ ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుంది.

సాయంత్రం 6గంటల తర్వాత సభలు, సమావేశాలు పెట్టకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు... ప్రచార సమయం ముగిసిన తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలులేదని ఆదేశించారు. ప్రచారం  కోసం బయటి నుంచి నియోజకవర్గాలకు వచ్చిన వారంతా వెళ్లిపోవాలని తెలిపింది. రాజకీయ పార్టీలు నియమించుకున్న రాష్ట్ర ఇంఛార్జ్‌లు.. పార్టీ కార్యాలయాల్లోనే ఉండాలి. ఆఫీసు దాటి బయటకు రావొద్దని ఈసీ స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా  సాయంత్రం 6గంటలకు ప్రచారం ముగుస్తుండగా... సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో అయితే సాయంత్రం 5గంటలకే ప్రచారానికి సమయం ఇచ్చారు. అలాగే... అరకు, పాడేరు, రంపచోడవరం  నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే ప్రచారం పూర్తవుతుంది. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎల్లుండి (మే 13) పోలింగ్‌ జరగనుంది. ఇక.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇక రెండు రోజులే  సమయం ఉంది. దాదాపు రెండు నెలలు... ప్రచారంతో ఊదరగొట్టాయి రాజకీయ పార్టీలు. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. తమను గెలిపిస్తే ఏమేం చేస్తామని... ఓటర్లకు వివరంగా చెప్పాయి. ఇక...  సాయంత్రం 6గంటల తర్వాత.. ప్రచారం ముగుస్తుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు వాదనలు, వాగ్దానాలు.. హామీలు.. చేసిన పనులు, చేస్తామన్న పనులు అన్నీ విన్న ఓటర్లు... ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునేందుకు... సమయం  ఉండాలనే ఈసీ... రెండు రోజులు సమయం ఇస్తుంది. ఓటర్లు బాగా ఆలోచించుకుని సరైన అభ్యర్థికి ఓటు వేయాలనే ఉద్దేశంతో... సైలెన్స్‌ పీరియడ్‌ తెచ్చింది. ఈరోజు సాయంత్రం నుంచి... పోలింగ్‌ ముగిసే వరకు ఉన్న 48గంటల సమయం... సైలెన్స్‌  పీరియడ్‌ అమల్లో ఉంటుందని తెలిపింది ఎన్నికల కమిషన్‌. 

ఈ 48 గంటల సయమంలో... ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభాలాలకు గురిచేయకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది. బల్క్‌ మెసేజ్‌లపై నిషేధం విధించింది. సినిమా, టెలివిజన్‌ లేదా.. మరేదైన మార్గం ద్వారాను ప్రచారం నిర్వహించకూడదని  స్పష్టంగా తెలిపింది. ఎన్నికల ప్రచారం ముగియడమే కాదు.. మద్యం షాపులను కూడా సాయంత్రం 6గంటల నుంచి మూసివేస్తున్నారు. ఈనెల 13న పోలింగ్‌ ఉండటంతో... 14వ తేదీనే మద్యం షాపులు తెరుస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget