అన్వేషించండి

ఈటలపై పైచేయి సాధించిన బండి- తుల ఉమకు నిరాశ- పార్టీ వీడే యోచన!

Tula Uma Going To Resigning BJP : తెలంగాణ బీజేపీపై ఈటల పట్టు సాధిస్తున్నారా..? లేదంటే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పట్టు నిలుపుకున్నారా ? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

తెలంగాణ(Telangana) బీజేపీపై ఈటల(Etela Rajendar) పట్టు సాధిస్తున్నారా..? లేదంటే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) పై సాధించారా ? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల క్రితం ఇటీవల చేరిన ఈటల రాజేందర్ కంటే ముందు నుంచి ఉన్న బండి సంజయ్ పైనే పార్టీ హైకమాండ్‌ విశ్వసనీయత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో కమలం పార్టీ వైపు నిలబడిన అభ్యర్థులను చూస్తే, బండి సంజయ్ కే అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు కేటాయింకచినా, తుల ఉమకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం దుమారం రేపుతోంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల వ్యవహారం చిచ్చు రాజేస్తోంది. పార్టీలోని కీలక నేతలు ఎవరికివారు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకున్నారు. కొందరు అనుకున్న ఫలితాలను సాధించగా, మరికొందరికి మొండిచేయి చూపింది బీజేపీ హైకమాండ్. పోయిన చోటే వెతుక్కొవాలని  భావిస్తోన్న కమలం పార్టీ, బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ కేడర్ డీలా పడింది. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. తాజాగా బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తోంది. అయితే  సీఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ లో ఒకరు ఉంటారని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనేలా వ్యవహరిస్తోంది. 

భాగ్యనగరంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీకి ఈటలను పక్కన కూర్చోబెట్టుకోవడం, బండి సంజయ్ ని అభినందించడం వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. కథ అక్కడి వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత సీన్ మారిపోయింది. టికెట్ల కేటాయింపు వ్యవహారం ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య చిచ్చురేపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమకు వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. మాజీ జడ్పీ ఛైర్మన్ గా పని చేసిన తుల ఉమ, వేములవాడ స్థానానికి నామినేషన్ కూడా వేశారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. అయితే నామినేషన్ల చివరి రోజు తుల ఉమకు బీజేపీ నాయకత్వం షాక్ ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్ ఇచ్చింది. బీఫాం కూడా ఇవ్వడంతో వికాస్ రావు నామినేషన్ వేశారు. 

టికెట్ ఆఖరి నిమిషంలో చేజారిపోవడంతో తుల ఉమ బోరున విలపించారు. తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు. అయితే టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆమె బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్‌ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. బీజేపీ నుంచి కూడా బుజ్జగింపులు ప్రారంభమైనట్టు వార్తలు వస్తున్నాయి. 

ఈటల రాజేందర్ అనుచరవర్గంలో కీలకంగా ఉన్న తుల ఉమకు కాకుండా వికాస్ రావును బరిలోకి దించడంపై మాజీ మంత్రి లోలోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్ విషయంలోను ఈటల తన అనుచరుడు సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరడంతో పార్టీ మొండి చేయి చూపింది. ఆ స్థానాన్ని బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, వికాస్ రావుకు టికెట్ వచ్చేలా చివరి నిమిషంలో చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తుల ఉమకు అన్యాయం జరగడంపై ఈటల రాజేందర్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైనట్లు తెలుస్తోంది. మొత్తంగా అసెంబ్లీ సీట్ల వ్యవహారంలో ఈటల రాజేందర్ పై బండి సంజయ్ పైచేయి సాధించినట్లు బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget