అన్వేషించండి

CM YS Jagan: చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్టే- తాడిపత్రి సభలో సీఎం జగన్

AP Assembly Elections 2024: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి సభలో విమర్శలు గుప్పించారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు.

Cm Ys Jagan Setairs On Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తలపెట్టినట్టేనని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం మధ్యాహ్నం తాడిపత్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్ర లేపినట్టేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల యుద్ధానికి తాడిపత్రి సిద్ధమేనా అని జగన్ కేడర్ ను ప్రశ్నించారు.

ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు 
రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు జెండాలు జతకట్టుకొని వస్తున్నాయని, జగన్ ఒంటరిగా ప్రజలను నమ్ముకుని వస్తున్నాడని వెల్లడించారు. మీ జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని.. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపేననీ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం అలవాటేనన్న జగన్.. తాను మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

మేనిఫెస్టేను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా తాను భావిస్తానని, గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో 2.70 లక్షల కోట్ల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని, ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన సాగించామని స్పష్టం చేశారు. 58 నెలల కాలవ్యవధిలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. 

విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం

గడిచిన ఐదేళ్ల పాలనలో విపులవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరు సేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామని, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను నూతనంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి గ్రామం, పట్నంలో సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా గ్రామాల్లోనే రైతులకు మేలు కలిగిస్తున్నామన్నారు. ఇంటి వద్దకే రేషన్ తీసుకువచ్చే సౌలభ్యాన్ని కల్పించామని, మీ బిడ్డ జగన్ పాలనలో ఇంటికే వైద్య సేవలు అందుతున్నాయి అన్నారు. మళ్లీ మీ బిడ్డ జగన్ ప్రభుత్వమే వస్తే.. ప్రజల జీవితాలు మరింత బాగుపడతాయి అన్నారు.

నాడు నేడు పథకంలో భాగంగా స్కూళ్ళ రూపు రేఖలను మార్చేశామని, టాప్ యూనివర్సిటీలతో డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరో 15 ఏళ్లపాటు ఇలాంటి పాలన సాగితే.. ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమవుతుందన్నారు. గతంలో ఎప్పుడూ చూడని మహిళా సాధికారతను గడిచిన ఐదేళ్లలోనే చూసామన్న జగన్.. 50% రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్ పదవులు కూడా కల్పించామన్నారు. మహిళల పేరుతోనే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని సీఎం వివరించారు. 80% ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చామని, అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో సగం స్థానాలను మహిళకే కేటాయించామన్నారు. 

మోసాలు.. కుట్రలు నమ్ముకొని చంద్రబాబు రాజకీయం

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. మోసాలు కుట్రలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం అయినా ఉందా..? అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని, డ్వాక్రా రుణాల పేరుతో మహిళలను దగా చేశాడన్నారు. ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో 25000 డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.

ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ హామీల పేరుతో మరో డ్రామాకు చంద్రబాబునాయుడు తెరతీసారని, సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా జగన్ ప్రజలను కోరారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో పార్లమెంటుకు పంపించాలని కోరారు. ప్రజలకు మంచి చేసిన జగన్ వెంట ఉండాలని ఆయన మరో మారు విజ్ఞప్తి చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget