అన్వేషించండి

AP Election 2024 Polling Percentage:ఏపీలో మొత్తం ఓటింగ్ శాతం 81.86- పాత రికార్డులు పక్కకు జరిగాయి- కొత్త చరిత్రకు కుర్చీ వేశాయి

AP Election 2024 Total Voting Percentage: ఏపీలో ఈసారి కూడా ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించారు. గత రికార్డులను తిరగరాస్తూ కొత్త చరిత్రకు నాంది పలికారు. 2029తో పోలిస్తే 1.20 శాతం అధికంగా రికార్డు అయింది.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈవీఎంలు బద్దలయ్యేలా ఓట్లు పడ్డాయి. ఉప్పెనలా కదిలి వచ్చిన ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు. 

2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసిన వారి శాతం 80.66 శాతంగా తేల్చారు. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వేసిన బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా చెబుతున్నారు. ఇది 1.20 శాతం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో నమోదైన మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతం. ఇది గత ఎన్నికల్లో నమోదైనదాని కంటే ఎక్కువ. 2019 కంటే 2 శాతం పెరిగింది. 

ముందుగానే టార్గెట్‌గా పెట్టుకున్న 82 శాతం విజయవంతంగా రీచ్ అయ్యామన్నారు ఎన్నికల ప్రధాన అధికారిల ముఖేష్‌కుమార్‌ మీనా. దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల్లో ఇదే ఎక్కువని పేర్కొన్నారు. వేకువ జామున రెండు గంటల వరకు పోలింగ్ జరగడం వల్లే పోలింగ్‌ శాతాలు ఆలస్యంగా చెప్పాల్సి వస్తుందని అన్నారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి మంగళవారం సాయంత్రం అయిందన్నారు.. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఉదయం భారీగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారని... మధ్యాహ్నానికి కాస్త పల్చబడ్డారని పేర్కొన్నారు మీనా. సాయంత్రం నాలుగు గంటల తర్వాత భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారని తెలిపారు. అందుకే 6 గంటల తర్వాత కూడా 3500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగిందని ఇది వేకువ జాము 2 గంటల వరకు కొనసాగినట్టు వివరించారు. 

ఈసారి ఎన్నికల్లో చాలా అనూహ్యమైన ఘటనలు జరిగాయన్నారు ముఖేష్‌కుమార్ మీనా. పార్లమెంట్‌ కు ఓటు వేసే వారితో పోల్చుకుంటే అసెంబ్లీ అభ్యర్థులు ఓటు వేసే వారి సంఖ్య 200 మంది ఎక్కువ ఉన్నారని తెలిపారు. ఈసారి అర్బన్‌లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది అందుకు విశాఖలో నమోదు అయిన పోలింగ్ ఉదాహరణగా పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్ శాతం అసెంబ్లీ సెగ్మెంట్‌లో చూసుకుంటే దర్శిలో ఎక్కువ శాతం నమోదైంది. ఇక్కడ 90.91 శాతం ఓటింగ్ పోల్ అయింది. పార్లమెంట్‌ స్థానంలో విషయంలో ఒంగోలు 87.6తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక 63.32 శాతంతో కడప అసెంబ్లీ సెగ్మెంట్‌ అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు చేసుకుంది. పార్లమెంట్ సెగ్మెంట్‌ విషయానికి వస్తే విశాఖ ఆఖరి స్థానంలో ఉంది. ఇక్కడ 69.9 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. అయితే 2019తో పోల్చుకుంటే ఇక్క పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే 3.8 శాతం పెరిగింది. 

గత ఎన్నికల్లో నమోదు అయిన పోలింగ్ సరళిని చూస్తే
2019లో - 79.80 శాతం 
2014లో-78.90 శాతం 
2009లో-79.80 శాతం 
2004లో- 69.8 శాతం 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
యూజ్డ్‌ Hyundai Venue కొనాలనుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోకపోతే మీరు మోసపోతారు!
సెకండ్‌ హ్యాండ్‌ Hyundai Venue కొనే ముందే కారులో ఇవి చూడండి, లేదంటే బోల్తా పడతారు!
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Human Immortality: మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
Embed widget