Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన
Telangana New CM: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
LIVE

Background
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు.
2 రోజుల నుంచి హోటల్ లోనే రేవంత్.. అక్కడి నుంచే నేతలతో మంతనాలు
కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హోటల్ పల్లా నుంచి బయటకు రాలేదు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఖర్గే నేతృత్వంలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ తదితర అగ్రనేతలు ఢిల్లీలో సమావేశమై సీఎం ఎంపికపై చర్చించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రెండు రోజులనుంచి హోటల్లోనే ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేశారని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలుపై సమావేశం జరిగింది.
హోటల్ కు వెళ్లి రేవంత్ ను కలిసిన సీపీఐ నేతలు
తెలంగాణ సీఎం ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా డిసైడ్ చేసినట్లు సమాచారం. విషయం తెలియగానే హోటల్ ఎల్లాకి కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. సీపీఐ అగ్రనేతలు సైతం హోటల్ కు చేరుకున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హోటల్ ఎల్లాకి చేరుకుని రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ సహా కాంగ్రెస్ కీలక నేతలతో సీపీఐ అగ్రనేతలు భేటీ అయ్యారు. నేటి సాయంత్రం సీఎం పేరును డీకే శివకుమార్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో సీపీఐ నేతలు, హోటల్ కు చేరుకుని రేవంత్ తో భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది.
హైదరాబాద్ కు బయలుదేరిన డీకే శివకుమార్, సాయంత్రం సీఎల్పీ భేటీ
మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో తెలంగాణ సీఎం ఎంపికపై కీలకంగా చర్చించారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీటింగ్ అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం మల్లికార్జున ఖర్గే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. సాయంత్రం సీఎల్పీ భేటీ నిర్వహించి అధిష్టానం నిర్ణయాన్ని శివకుమార్ ప్రకటించనున్నారు.
Telangana New CM: ఢిల్లీలో ఖర్గే నివాసంలో ముగిసిన కీలక భేటీ
తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ నేతల సమావేశం ముగిసింది. రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల నిర్ణయంపై కీలకంగా చర్చ జరిగింది. సమావేశం అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ కు బయలుదేరారు. సాయంత్రం మరోసారి సీఎల్పీ భేటీ నిర్వహించి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

