News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నాయి?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ ఉందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. అయితే కుమారస్వామి పార్టీ జేడీఎస్ పరిస్థితి ఏంటీ.. ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం

FOLLOW US: 
Share:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మే 2023న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, మే 10న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం (మార్చి 13) ఈ విషయాన్ని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి యత్నిస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాలు కాంగ్రెస్, జెడిఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

వీటన్నింటి మధ్య ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ నిర్వహించడమే కాకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. పోటీ బీజేపీ, కాంగ్రెస్  మధ్యే ఉన్నట్లు కనిపిస్తున్నా కుమారస్వామి పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అంటే జేడీఎస్ కూడా కింగ్ మేకర్ కావచ్చని సర్వే చెబుతోంది. 

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనాలో జేడీఎస్ పరిస్థితి!

ఏబీపీ న్యూస్-సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ కు 115-127 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ తెలిపింది. బీజేపీకి 68 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో జేడీఎస్ కు 23-35 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఇతరులకు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల ఫలితాల్లో జేడీఎస్

ఏబీపీ-సీఓటర్‌తోపాటు మెట్రో, లోక్‌పోల్, పాపులర్ పోల్స్ డేటాను కూడా ఈ పోల్లో పొందుపరిచారు. జేడీఎస్ కు 23 నుంచి 35 సీట్లు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వే అంచనా వేయగా, కుమారస్వామి పార్టీకి 23 నుంచి 33 సీట్లు వస్తాయని మిగతా డేటా బట్టి తెలుస్తోంది. 

లోక్ పోల్ లో 21 నుంచి 27 సీట్లు, పాపులర్ పోల్స్ ప్రకారం జేడీఎస్ కు 42 సీట్లకు గాను 45 సీట్లు వస్తాయి. కాబట్టి జేడీఎస్ కు 27 నుంచి 35 సీట్లు వస్తాయని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఈ పార్టీ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని అర్థమవుతోంది.

ఈ ఒపీనియన్ పోల్ లో 24 వేల 759 మంది అభిప్రాయం తీసుకున్నారు. కర్ణాటకలోని అన్ని స్థానాల్లో ఒపీనియన్ పోల్ నిర్వహించారు. మైనస్ 3 నుంచి మైనస్ 5 శాతం వరకు తేడా ఉందని ఒపీనియన్ పోల్ లో తేలింది.

కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చే అవకాశం

ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 115-127 సీట్లు వస్తాయని, మొత్తం ఓట్లలో 40.1 శాతం వస్తాయని సర్వే తెలిపింది. బీజేపీకి 34.7 శాతం ఓట్లతో 68-80 సీట్లు, జేడీఎస్‌కు 17.9 శాతం ఓట్లతో 23-35 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతర పార్టీలకు 7.3 శాతం ఓట్లు, 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

బీజేపీ - 68-80
కాంగ్రెస్ - 115-127
జేడీఎస్ - 23-35
ఇతరులు - 0-2

కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ ఓట్ల శాతం 2 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు వచ్చాయి. ఇది ఈసారి 1.3 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. జేడీఎస్‌కు గతసారి 18 శాతం ఓట్లు రాగా, ఈసారి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

గమనిక: ఏబీపీ న్యూస్ కోసం ఈ ఒపీనియన్ పోల్ ను సీ-ఓటర్ నిర్వహించింది. ఒపీనియన్ పోల్ ఫలితాలు పూర్తిగా ప్రజలతో జరిపిన సంభాషణ, వారు వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. దీనికి ఏబీపీ దేశం బాధ్యత వహించదు

Published at : 30 Mar 2023 06:24 AM (IST) Tags: BJP CONGRESS PM Modi ABP News CVoter Survey JDS Elections 2023 Kumara Swamy Karnataka Election 2023 Karnataka Polls 2023

ఇవి కూడా చూడండి

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

Anantapur TDP politics : జేసీ పవన్ ఎక్కడ ? అనంతపురం ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?

Anantapur TDP politics :   జేసీ పవన్ ఎక్కడ ?  అనంతపురం ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!