అన్వేషించండి

YSRHU: నవంబర్‌ 2, 3 తేదీల్లో హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌, వివరాలు ఇలా

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్‌) ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్‌) ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌ నవంబర్‌ 2, 3 తేదీల్లో వర్సిటీ పరిపాలన భవనంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు అక్టోబరు 31న ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్వయంగా వర్సిటీలో జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని రిజిస్ట్రార్‌ సూచించారు.

కేటగిరీలవారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥  నవంబరు 2న ఉదయం 9.30 నుంచి 1106 నుంచి 16,966 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

➥ నవంబరు 2న మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 17,003 నుంచి 28,992 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

➥ నవంబరు 3న ఉదయం 9.30 నుంచి 29,002 నుంచి 45,909 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

➥ నవంబరు 3న మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 46,030 నుంచి 68,075 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

➛ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ తప్పనిసరిగా సీటు వస్తుందనే హామీ ఏమీ లేదు. రిజర్వేషన్లు, తదితర అంశాలపై సీట్ల కేటాయింపు ఆధారపడి ఉంటుంది.

➛ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులందరూ తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురావాల్సి ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి తమకు కేటాయించిన కళాశాలలో సీటు కేటాయింపును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

➛ కేటగిరీలవారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను అధికారులు అక్టోబరు 31న ప్రకటించారు.
దీనిప్రకారం. 

YSRHU: నవంబర్‌ 2, 3 తేదీల్లో హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌, వివరాలు ఇలా

ALSO READ:

ఇంజినీరింగ్ విద్యార్థులకు 'ఆత్మస్థైర్య' పాఠాలు
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మొద­టి సంవత్సరంలోనే 'ఆత్మస్థైర్యం' కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలని విశ్వవిద్యాలయా­లకు సూ­చించింది.  ఇంటర్‌ వరకు బట్టీ విధానంలో చదివే విద్యార్థులు, ఇంజినీరింగ్‌ విద్యకు వచ్చేసరికి.. అక్కడి విభిన్న విద్యావిధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఏఐసీటీఈ భావిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజినీరింగ్‌ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమైనందున.. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు దీనిపై దృష్టి సారించాలని వీలుందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.
ఏఐసీటీఈ చేసిన సూచనల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్‌' తప్పనిసరి..
దేశంలో 'ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022' నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్‌ రెండు రకాలుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget