అన్వేషించండి

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబరు 22) నుంచి ప్రారంభంకానుంది.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబరు 22) నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచినవారు ఐసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనలేకపోయినవారికి సెప్టెంబరు 22న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. అభ్యర్థులకు సెప్టెంబరు 23న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారికి సెప్టెంబరు 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వీరికి సెప్టెంబరు 28న సీట్లను కేటాయిస్తారు.

సీట్లు పొందినవారు సెప్టెంబరు 28 నుంచి 30 లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబరు 29, 30 తేదీల్లో నేరుగా కళాశాలకు వెళ్లి మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకొని సీటు కేటాయింపును నిర్దారించుకోవాలి. ఇక సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. 
 
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా..  సెప్టెంబ‌రు 15న‌ సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఐసెట్‌లో 61,092 మంది ఉత్తీర్ణులుకాగా.. ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం 31,552 మందే హాజరయ్యారు.

ఎంబీఏలో 24,029 సీట్లకు 20,985, ఎంసీఏలో 3,009 సీట్లకు అన్నీ భర్తీ అయ్యాయి. వాటిల్లో 902 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు పొందారు. మొత్తం 255 కళాశాలల్లో 80 చోట్ల అన్నీ సీట్లు నిండాయి. సీట్లు పొందిన వారు సెప్టెంబ‌రు 20వ తేదీలోపు ఫీజు చెల్లించి, 29, 30 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు. ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌కు 10,762 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 729 ఎంసీఏ, మిగిలినవి ఎంబీఏ సీట్లు. 

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్: 22.09.2023.

➥ స్లాట్ బుకింగ్ చేసుకున్నవారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్: 23.09.2023.

➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 22.09.2023 - 24.09.2023.

➥ ఫ్రీజింగ్ ఆప్షన్లు: 24.09.2023.

➥ సీట్ల కేటాయింపు: 28.09.2023.

➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 28.09.2023 - 30.09.2023.

➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 29.09.2023 - 30.09.2023.

Counselling Website

ALSO READ:

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Madalasa Sharma : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు  అవసరమైన చోట అదరగొట్టేసింది..!
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు అవసరమైన చోట అదరగొట్టేసింది..!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
Embed widget