అన్వేషించండి

TS EDCET 2022: రేపే టీఎస్ ఎడ్‌సెట్‌ 2022 ఎగ్జామ్, అభ్యర్థులు ఇవి తప్పక పాటించండి

TS EDCET 2022 Exam Date: బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఎడ్‌సెట్-2022 పరీక్ష జూలై 26న నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. అభ్యర్థులు ఇవి పాటించాలి.

బీఈడీ కోర్సులో ప్రవేశాల‌కు ఈ నెల 26న తెలంగాణ ఎడ్‌సెట్ 2022 (TS EDCET 2022) నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఎడ్‌సెట్-2022 కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు సెషన్లలో నిర్వహించనున్న టీఎస్ ఎడ్‌సెట్ కు మొత్తం 38,091 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఎడ్ సెట్ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ క‌ర్నూలు, విజ‌య‌వాడ‌లో రెండు ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

మూడు సెషన్లలో ఎడ్‌సెట్.. 
ఈ ఏడాది తెలంగాణ ఎడ్‌సెట్‌కు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జూలై 26న పరీక్ష నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. తొలి సెషన్ ఉదయం 9.00 - 11.00 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. 2వ సెషన్ మ‌ధ్యాహ్నం 12.30- మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల వరకు, 3వ సెషన్ ఎగ్జామ్ సాయంత్రం 4.00 గంట‌ల నుంచి 6.00 గంట‌ల వ‌ర‌కు నిర్వహించనున్నారు. మూడు సెషన్లలో కలిపి 38,091 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో సెషన్ 1కు  12,634 మంది అభ్యర్థులు హాజరు కానుండగా.. సెషన్ 2 పరీక్షకు 12,732 మంది, సెషన్ 3 పరీక్షకు 12,725 మంది ఎడ్‌సెట్ అభ్యర్థులు హాజరుకానున్నారు. 

అభ్యర్థులు ఇవి తప్పనిసరిగా పాటించాలి.. 
కొవిడ్ ప్రొటోకాల్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని సూచించారు.
పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలి.
ప‌రీక్ష ప్రారంభ‌మైన త‌ర్వాత వ‌చ్చే అభ్యర్థుల‌ను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమ‌తించ‌బోమ‌ని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు ముఖానికి మాస్క్ ధరించాలని సూచించారు.
ఇప్పటివరకూ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  https://edcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

ఆ విద్యార్థులు అనర్హులు
తెలంగాణలో మొత్తం 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎడ్‌సెట్‌ రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సాధిస్తేచాలు. డిగ్రీ, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చని కన్వీనర్ రామకృష్ణ పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు బీఈడీ చేసేందుకు అనర్హులని వెల్లడించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in  http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.

తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ ఏప్రిల్‌లో విడుదలైంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించినట్లు కన్వీనర్ రామకృష్ణ వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించారు. లేట్ ఫీజు రూ.250తో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఏపీలో ఎడ్‌సెట్‌ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. 
Also Read: JEE Main 2022 Postpone : చివరి క్షణంలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా - కొత్త తేదీలపైనా రాని క్లారిటీ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026 : ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget