అన్వేషించండి

TGTET: టెట్‌ పరీక్షలకు 74 శాతం అభ్యర్థులు హాజరు, ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఎప్పుడంటే?

TS TET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్‌లైన్ రాతపరీక్షలు జనవరి 20తో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు 2,05,278 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24న టెట్ ఆన్సర్ కీని విడుదలచేయనున్నారు.

Telangana TET 2024 December: తెలంగాణలో జనవరి 2న ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET)) ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి జనవరి 20 వరకు పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1, 2 కలిపి మొత్తం 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,05,278 మంది (74.44 శాతం) పరీక్షలకు  హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు జనవరి 24 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయవచ్చని ఆయన సూచించారు. 

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ గురించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. అందుకనుగుణంగా ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గత ఆగస్టులోనే ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్(2024-25 సంవత్సరానికి) విడుదల చేసింది. ప్రకటించిన ప్రకారం.. 2024లో రెండోసారి టెట్ పరీక్ష (TET December 2024) నిర్వహించింది. క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ 2025  విడుదల చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

ఎస్సీ వర్గీకరణపై పీఠముడి..
ఎస్సీ వర్గీకరణ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌‌ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరిలోపు ఈ అంశంపై స్పష్టం వస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. అయితే వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా..? అన్నది తెలియడం లేదు. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వచ్చే డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది. 

గత డీఎస్సీలో 10 వేలకు పైగా పోస్టుల భర్తీ..
తెలంగాణలో గత డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎన్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ,796 పోస్టులు ఎస్జీటీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేస్తే 2,45,263 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఎక్కువ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షకు 92.10 శాతం మంది హాజరయ్యారు. డీఎస్సీ ఫలితాల ఆధారంగా 10 వేలకు పైగా కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో భర్తీచేసే పోస్టులపై విద్యాశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget