అన్వేషించండి

TGTET: టెట్‌ పరీక్షలకు 74 శాతం అభ్యర్థులు హాజరు, ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఎప్పుడంటే?

TS TET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్‌లైన్ రాతపరీక్షలు జనవరి 20తో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు 2,05,278 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24న టెట్ ఆన్సర్ కీని విడుదలచేయనున్నారు.

Telangana TET 2024 December: తెలంగాణలో జనవరి 2న ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET)) ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి జనవరి 20 వరకు పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1, 2 కలిపి మొత్తం 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,05,278 మంది (74.44 శాతం) పరీక్షలకు  హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు జనవరి 24 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయవచ్చని ఆయన సూచించారు. 

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ గురించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. అందుకనుగుణంగా ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గత ఆగస్టులోనే ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్(2024-25 సంవత్సరానికి) విడుదల చేసింది. ప్రకటించిన ప్రకారం.. 2024లో రెండోసారి టెట్ పరీక్ష (TET December 2024) నిర్వహించింది. క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ 2025  విడుదల చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

ఎస్సీ వర్గీకరణపై పీఠముడి..
ఎస్సీ వర్గీకరణ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌‌ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరిలోపు ఈ అంశంపై స్పష్టం వస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. అయితే వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా..? అన్నది తెలియడం లేదు. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వచ్చే డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది. 

గత డీఎస్సీలో 10 వేలకు పైగా పోస్టుల భర్తీ..
తెలంగాణలో గత డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎన్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ,796 పోస్టులు ఎస్జీటీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేస్తే 2,45,263 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఎక్కువ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షకు 92.10 శాతం మంది హాజరయ్యారు. డీఎస్సీ ఫలితాల ఆధారంగా 10 వేలకు పైగా కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో భర్తీచేసే పోస్టులపై విద్యాశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Farmer Selfie Suicide Video: కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
Kuttram Purindhavan OTT : చిన్నారి మిస్సింగ్... అసలు నిందితుడు ఎవరు? - తెలుగులోనూ క్రైమ్ థ్రిల్లర్ 'కుట్రమ్ పురింధవన్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చిన్నారి మిస్సింగ్... అసలు నిందితుడు ఎవరు? - తెలుగులోనూ క్రైమ్ థ్రిల్లర్ 'కుట్రమ్ పురింధవన్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Farmer Selfie Suicide Video: కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
Kuttram Purindhavan OTT : చిన్నారి మిస్సింగ్... అసలు నిందితుడు ఎవరు? - తెలుగులోనూ క్రైమ్ థ్రిల్లర్ 'కుట్రమ్ పురింధవన్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చిన్నారి మిస్సింగ్... అసలు నిందితుడు ఎవరు? - తెలుగులోనూ క్రైమ్ థ్రిల్లర్ 'కుట్రమ్ పురింధవన్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Upcoming Telugu Movies : లాస్ట్ మంత్... ఫస్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో 'అఖండ' తాండవం... ఓటీటీల్లో మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
లాస్ట్ మంత్... ఫస్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో 'అఖండ' తాండవం... ఓటీటీల్లో మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
Viral Video: బీరు బాటిల్‌తో త‌ల ప‌గుల‌కొట్టుకుని ర‌క్తంతో మ‌హేష్‌బాబు ఫ్లెక్సీకి  వీర‌తిలకం.. వీడియో వైరల్
బీరు బాటిల్‌తో త‌ల ప‌గుల‌కొట్టుకుని ర‌క్తంతో మ‌హేష్‌బాబు ఫ్లెక్సీకి వీర‌తిలకం.. వీడియో వైరల్
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Spirit OTT: స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్... అదీ ప్రభాస్ - వంగా కాంబో డిమాండ్
స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్... అదీ ప్రభాస్ - వంగా కాంబో డిమాండ్
Embed widget