అన్వేషించండి

TGTET: టెట్‌ పరీక్షలకు 74 శాతం అభ్యర్థులు హాజరు, ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఎప్పుడంటే?

TS TET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్‌లైన్ రాతపరీక్షలు జనవరి 20తో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు 2,05,278 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24న టెట్ ఆన్సర్ కీని విడుదలచేయనున్నారు.

Telangana TET 2024 December: తెలంగాణలో జనవరి 2న ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET)) ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి జనవరి 20 వరకు పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1, 2 కలిపి మొత్తం 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,05,278 మంది (74.44 శాతం) పరీక్షలకు  హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు జనవరి 24 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయవచ్చని ఆయన సూచించారు. 

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ గురించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. అందుకనుగుణంగా ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గత ఆగస్టులోనే ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్(2024-25 సంవత్సరానికి) విడుదల చేసింది. ప్రకటించిన ప్రకారం.. 2024లో రెండోసారి టెట్ పరీక్ష (TET December 2024) నిర్వహించింది. క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ 2025  విడుదల చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

ఎస్సీ వర్గీకరణపై పీఠముడి..
ఎస్సీ వర్గీకరణ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌‌ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరిలోపు ఈ అంశంపై స్పష్టం వస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. అయితే వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా..? అన్నది తెలియడం లేదు. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వచ్చే డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది. 

గత డీఎస్సీలో 10 వేలకు పైగా పోస్టుల భర్తీ..
తెలంగాణలో గత డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎన్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ,796 పోస్టులు ఎస్జీటీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేస్తే 2,45,263 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఎక్కువ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షకు 92.10 శాతం మంది హాజరయ్యారు. డీఎస్సీ ఫలితాల ఆధారంగా 10 వేలకు పైగా కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో భర్తీచేసే పోస్టులపై విద్యాశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget