అన్వేషించండి

Poitics On Inter Results : అసమర్థ పాలనతో ఇంటర్ విద్యార్థులకు క్షోభ - జగన్ సర్కార్‌పై టీడీపీ విమర్శలు

జగన్ సర్కార్ విధానాల వల్ల ఇంటర్‌లో ఫలితాలు దారుణంగా వచ్చాయని టీడీపీ మండిపడింది. విద్యా ప్రమాణాలను దిగజార్చుతున్నారని విమర్శించింది.

 

Poitics On Inter Results  :   ఎపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి...అయితే ఇదే స‌మ‌యంలో రాజ‌కీయం కూడ మెద‌ల‌య్యింది.  ప‌రీక్ష‌ల వ్య‌వ‌హ‌రంలో జ‌గ‌న్ స‌ర్కారు పై టీడీపీ విరుచుకుప‌డింది. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యింది జగన్ స‌ర్కారేన‌ని కొండేపి శాస‌న స‌భ్యుడు డోల బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఇంటర్ ఫలితాలకు ఆదిమూలపు సురేష్, జగన్ రెడ్డిలు బాధ్యత వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల విడుదల త‌రువాత‌ లక్షల మంది తల్లిదండ్రులు కడుపు కోతకు గురయ్యారని ఆయ‌న వ్యాఖ్యానించారు.ఎంసెట్ రాసి ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్న విద్యార్ధుల కలలను జగన్ రెడ్డి నీరు గార్చారని ఆయ‌న ద్వ‌జ‌మెత్తారు.

ఇతర రాష్ట్రాల్లో కరోనా ఉన్నా గొప్పగా ఫలితాలు రావడం లేదా ?

టీడీపీ  కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన బాల వీరాంజనేయ స్వామి టీడీపీ హయాంలో 2018-19లో ఇంటర్ మొదటి సంవత్సరం 60 శాతం ఉత్తీర్ణత  ఉంటే నేడు 54 శాతానికి పడిపోయింది. అదే విధంగా రెండో సంవత్సరం 2018-19లో 68 శాతం ఉంటే ,నేడు 61 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు.  మొన్న పదవ తరగతి ఫలితాలు కూడా 2018-19లో 93 శాతం నుంచి 67 శాతానికి దిగజార్చారు. కరోనాను బూచిగా చూపించి విద్యార్ధుల ఫలితాలను కరోనాపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.  కేరళ, తమిళనాడు లో 90 శాతం ఇంటర్ లో ఉత్తీర్ణులయ్యారు.  అక్కడ కూడా కరోనా ఉన్నప్పుడు ఫలితాలు అక్కడ ఎందుకు గొప్పగా వచ్చాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

జగన్, ఆదిమూలపు సురేష్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌కు గండం 

జగన్ రెడ్డి చేత గాని పాలన వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.  ఆదిమూలపు సురేష్  విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత విద్యా సంస్థల అభివృద్ధి, భూముల ఆక్రమణ కోసం పాటుపడ్డారు తప్పా రాష్ట్ర విద్యా వ్యవస్థ కోసం కాదన్నారు.  నాడు నేడు పేరుతో రంగులు మార్చుకొని  రూ.3,500 కోట్లు దోచుకున్నారు.  టీడీపీ హాయంలో రెండు సార్లు డీఎస్సీ జరిపితే జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఒక్కసారైనా డీస్సీని నిర్వహించారా? లెక్చరర్ల పోస్టులను సైతం పట్టించుకోలేదు. భూములను కొట్టేసేందుకు కుట్రపన్ని ఎయిడెడ్ విద్యావ్యవస్థను బ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీచర్లు, లెక్చరర్ల పోస్టుల భర్తీ ఎందుకు చేయడం లేదు ?

ఉపాధ్యాయ బదిలీల్లోను అవకతవకలు జరిగాయని ప్రశ్నించినందుకు వారిపై పోలీసులపై దాడి చేయించారు. ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేశారు. పీఆర్సీ, సీపీఎస్ విషయాల్లోను ఉపాధ్యాయాలను మోసం చేశారు. టీచర్లను వైన్ షాపుల దగ్గర ఉంచారు. అదే విధంగా ఉపాధ్యాయులచే బాత్ రూంలు కడిగించి ఫోటోలు అప్ లోడ్ చేయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పెడితే జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం ఈ ఫలితాలకు పరోక్ష కారణమన్నారు.  ఇంటర్ లో విద్యార్ధులు అత్యధికంగా ఫెయిల్ అయితే అమ్మ ఒడి, ఫీజ్ రీయంబర్స్ మెంట్  లబ్దిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే విద్యార్ధులను ఉత్తీర్ణులు కాకుండా చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ కుంటుపడి ఖజానా ఖాళీ అయ్యింది కాబట్టి ఇలాంటి కుట్రలకు పాల్పడి విద్యార్ధుల భవిష్యత్ ను అంథకారంలోకి నెడుతున్నారని టీడీపీ విమర్శించింది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Bihar Sigma Gang: పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
Akhanda 2 Teaser: ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
Advertisement

వీడియోలు

Driver Saved 6 Persons in Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో | ABP Desam
MLA Kolikapudi Srinivas Controversy | ఉద్యమ నేతలు రాజకీయాల్లో రాణించలేరా...కొలికపూడి కాంట్రవర్సీ ఏంటీ?
Akhanda 2 Thaandavam  Blasting Roar | అఖండ 2 సినిమా NBK నుంచి బ్లాస్టింగ్ రోర్ వదిలిన బోయపాటి | ABP Desam
Erragadda Public Talk Jubilee hills By poll : నవీన్ యాదవ్ vs మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఎవరివైపు |ABP
Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Bihar Sigma Gang: పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
Akhanda 2 Teaser: ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
Bharat taxi: ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
New Bank Rule:బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
India Vs Australia T20 Series: భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి? పూర్తి షెడ్యూల్ ఇదే!
భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి? పూర్తి షెడ్యూల్ ఇదే!
Kurnool Bus Fire Accident : బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి? తరచూ జరుగుతున్న దుర్ఘటనలకు కారణమేంటీ?
బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి? తరచూ జరుగుతున్న దుర్ఘటనలకు కారణమేంటీ?
Embed widget