అన్వేషించండి

ఏపీలోని SRM Universityలో ఘనంగా ఐదో కాన్వకేషన్ - 1877 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టా అందజేత

SRM AP 5th Convocation: ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-ఏపీ ఐదో కాన్వకేషన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

SRM AP 5th Convocation: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-ఏపీ తన ప్రగతిశీల పయనంలో మరో మైలురాయిని అధిగమించింది. అక్టోబరు 28, 2025న నిర్వహించిన 5వ స్నాతకోత్సవ వేడుక కేవలం డిగ్రీల ప్రదాన కార్యక్రమమే కాదు, దేశ భవిష్యత్తుకు మార్గదర్శనం చేసే నిబద్ధత, సరిహద్దులు లేని ఆవిష్కరణ స్ఫూర్తిని చాటి చెప్పింది. మొత్తం 1877 మంది గ్రాడ్యుయేట్లు, 39 మంది డాక్టోరల్ స్కాలర్‌లు తమ విద్యా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకొని, ఈ ప్రతిష్టాత్మక వేదికపై డిగ్రీలను అందుకున్నారు.

ఈ మహోన్నత ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ టి ఆర్ పారివేందర్, ప్రో-ఛాన్సలర్ డాక్టర్ పి సత్యనారాయణన్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమ్‌కుమార్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు, అకడమిక్, పరిశోధనా మండలి సభ్యులు, డీన్‌లు, డైరెక్టర్లు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

' విద్యాబోధన కాదు, ప్రేరణే మా ప్రత్యేకత': ఎస్‌ఆర్‌ఎం-ఏపీ 

విద్యార్థులను కేవలం ఉద్యోగులుగా కాకుండా, భావి భారత ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడంలో ఎస్‌ఆర్‌ఎం-ఏపీ అనుసరిస్తున్న వినూత్న విధానాన్ని వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ టి ఆర్ పారివేందర్ ప్రముఖంగా ప్రస్తావించారు. గ్రాడ్యుయేట్లను అభినందిస్తూ, “మేము ఏం బోధిస్తున్నాము అన్నదాని కంటే, మేము ఎలా ప్రేరేపిస్తున్నాము అన్నదే మమ్మల్ని ప్రత్యేకంగా నిలుపులుతంది. ప్రతి విద్యార్థిని సరిహద్దులు దాటి ఆలోచించడానికి శక్తివంతులను చేయడమే ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-ఏపీ ముఖ్య లక్షణం” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వేడుకలో ప్రొ-ఛాన్సలర్ డాక్టర్ పి సత్యనారాయణన్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ కెరీర్‌లో ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు. వారు భవిష్యత్తును కేవలం ఉద్యోగులుగానే కాకుండా, సమస్య పరిష్కర్తలుగా , ఆవిష్కర్తలుగా , బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని ఉద్బోధించారు. ఈ సందేశం ఎస్‌ఆర్‌ఎం-ఏపీ కేవలం టెక్నికల్ స్కిల్స్‌నే కాక, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను కూడా విద్యార్థుల్లో పెంపొందించే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఏపీ నేతృత్వంలో ఏఐ విప్లవం: ముఖ్య అతిథి మధు ప్రత్యేక సందేశం

ముఖ్య అతిథి ప్రొఫెసర్ మధు మూర్తి తమ కాన్వకేషన్ ఉపన్యాసంలో దేశం సాంకేతిక భవిష్యత్తు గురించి దృష్టి సారించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరివర్తనకు కీలకంగా మారుతున్న తరుణంలో, ఈ గ్రాడ్యుయేట్లకు ఉన్న బాధ్యతను వివరించారు.

“మీ విద్య కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే సాధనంగా ఉండకూడదు. అది సేవ, నాయకత్వం, పరివర్తనకు  ఒక సాధనంగా ఉండాలి,” అని ఆయన గ్రాడ్యుయేట్లకు దిశానిర్దేశం చేశారు. భారతదేశం సాంకేతిక భవిష్యత్తుకు నాయకత్వం వహించడానికి అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా, 2047 నాటికి దేశం సాంకేతికపరంగా స్వావలంబన సాధించడంలో గ్రాడ్యుయేట్లు చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందేశం ఎస్‌ఆర్‌ఎం-ఏపీ గ్రాడ్యుయేట్లు జాతీయ లక్ష్యాలను సాధించడంలో కీలక భూమిక పోషించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది.

పరిశోధన, ఆవిష్కరణల్లో వృద్ధి: యూనివర్సిటీ వార్షిక నివేదిక  

వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ, డిగ్రీ పట్టా తీసుకోవడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటని, ఇది కష్టపడి సాధించిన తీపి అనుభూతిగా మిగులుతుందని అన్నారు. అనంతరం, యూనివర్సిటీ వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ నివేదికలో విద్యాసంబంధిత అంశాలు, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థి జీవితం, సామాజిక నిబద్ధత వంటి రంగాలలో సంస్థ సాధించిన వృద్ధిని ప్రముఖంగా హైలైట్ చేశారు. వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తెచ్చే విషయంలో ఎస్‌ఆర్‌ఎం-ఏపీ చేస్తున్న కృషి, పరిశోధనలపై ఇస్తున్న ప్రాధాన్యం, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన విద్యారంగంలో ఈ సంస్థ ప్రత్యేక విలువను నిరూపిస్తున్నాయి. సామాజిక నిబద్ధత కార్యక్రమాల ద్వారా విద్యార్థులు క్షేత్ర స్థాయిలో సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే నైపుణ్యాన్ని యూనివర్సిటీ ప్రోత్సహిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

అకడమిక్ ఎక్సలెన్స్‌కు సన్మానం:

ఈ వేడుకలో తమ అకడమిక్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న 1877 మంది గ్రాడ్యుయేట్లకు, 39 మంది డాక్టోరల్ స్కాలర్‌లకు డిగ్రీలను ప్రదానం చేశారు. విద్యాపరమైన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గౌరవిస్తూ, ముఖ్య అతిథి చేతుల మీదుగా బంగారు, వెండి, కాంస్య పతకాలను అందజేశారు.

• స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్సెస్ నుంచి 45 మంది గ్రాడ్యుయేట్లు,

• పారి స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి 7 మంది గ్రాడ్యుయేట్లు,

• ఈశ్వరి స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ నుంచి 4 మంది గ్రాడ్యుయేట్లు ... తమ ప్రతిభకు గాను పతకాలను అందుకున్నారు. 

ఈ అకడమిక్ ఎక్సలెన్స్ ఎస్‌ఆర్‌ఎం-ఏపీలో ఉన్నత ప్రమాణాల బోధన, శిక్షణకు నిదర్శనంగా నిలుస్తుందని అధ్యాపకులు తెలిపారు. చివరగా, పట్టభద్రులందరూ ప్రతిజ్ఞ చేయడంతో, జాతీయ గీతాలాపనతో, అతిథులు నిష్క్రమణతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ఎస్‌ఆర్‌ఎం-ఏపీ కేవలం ఉన్నత విద్యా సంస్థ మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఒక శక్తివంతమైన కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని చాటి చెప్పింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget