అన్వేషించండి

AP PGECET - 2024 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా

AP PGECT: ఏపీలోని పీజీ కళాశాలల్లో  ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'ఏపీ పీజీఈసెట్' పరీక్ష హాల్‌టికెట్లను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి మే 23న విడుదల చేసింది.

AP PGECET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌‌లోని పీజీ కళాశాలల్లో  ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024' పరీక్ష హాల్‌టికెట్లను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, ఎగ్జామ్ పేపర్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ పీజీఈసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి 31 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 13 సబ్జెక్టులకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను మే 31 నుంచి జూన్ 2 వరకు సబ్జెక్టులవారీగా తేదీలవారీగా విడుదల చేస్తారు. అనంతరం జూన్ 2 నుంచి 4 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం జూన్ 8న ఫలితాలను వెల్లడించనున్నారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

మే 29న:
ఉదయం: జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ.
మధ్యాహ్నం: కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ.

మే 30న:
ఉదయం: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్.
మధ్యాహ్నం: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ.

మే 31న:
ఉదయం: ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్.
మధ్యాహ్నం: నానో టెక్నాలజీ.

పరీక్ష విధానం.. 
మొత్తం  120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. 

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, తిరుపతి, గూడురు(తిరుపతి), రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నర్సారావుపేట, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, భీమవరం (పశ్చిమగోదావరి), కడప, హైదరాబాద్.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024(AP PGECET) నోటిఫికేషన్‌ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 5 వరకు.. చివరగా రూ.5000 ఆలస్య రుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల సవరణకు మే 8 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి మే 29 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన  హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేశారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Assembly Election : ఢిల్లీ ఎన్నికలు -  ఓటెయ్యండి - 50% డిస్కౌంట్ పొందండి - ఓటర్లకు సెలూన్లు, బ్యూటీ పార్లర్ల ఆఫర్లు
ఢిల్లీ ఎన్నికలు - ఓటెయ్యండి - 50% డిస్కౌంట్ పొందండి - ఓటర్లకు సెలూన్లు, బ్యూటీ పార్లర్ల ఆఫర్లు
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Thandel Movie Highlights: 'తండేల్'లో హైలెట్స్... ఆ ఆరు సీన్లతో గూస్ బంప్స్ పక్కా... థియేటర్లలో రాజులమ్మ జాతరే
'తండేల్'లో హైలెట్స్... ఆ ఆరు సీన్లతో గూస్ బంప్స్ పక్కా... థియేటర్లలో రాజులమ్మ జాతరే
Shantanu Naidu: రతన్‌ టాటా క్లోజ్‌ ఫ్రెండ్‌ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో పెద్ద పదవి
రతన్‌ టాటా క్లోజ్‌ ఫ్రెండ్‌ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో పెద్ద పదవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Assembly Election : ఢిల్లీ ఎన్నికలు -  ఓటెయ్యండి - 50% డిస్కౌంట్ పొందండి - ఓటర్లకు సెలూన్లు, బ్యూటీ పార్లర్ల ఆఫర్లు
ఢిల్లీ ఎన్నికలు - ఓటెయ్యండి - 50% డిస్కౌంట్ పొందండి - ఓటర్లకు సెలూన్లు, బ్యూటీ పార్లర్ల ఆఫర్లు
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Thandel Movie Highlights: 'తండేల్'లో హైలెట్స్... ఆ ఆరు సీన్లతో గూస్ బంప్స్ పక్కా... థియేటర్లలో రాజులమ్మ జాతరే
'తండేల్'లో హైలెట్స్... ఆ ఆరు సీన్లతో గూస్ బంప్స్ పక్కా... థియేటర్లలో రాజులమ్మ జాతరే
Shantanu Naidu: రతన్‌ టాటా క్లోజ్‌ ఫ్రెండ్‌ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో పెద్ద పదవి
రతన్‌ టాటా క్లోజ్‌ ఫ్రెండ్‌ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో పెద్ద పదవి
Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
Ram Mohan Naidu: రామ్మోహన్‌నాయుడిని పొగడ్తలతో ముంచెత్తిన ఎమ్మెస్కే.. మానవతావాది అంటూ కితాబు
రామ్మోహన్‌నాయుడిని పొగడ్తలతో ముంచెత్తిన ఎమ్మెస్కే.. మానవతావాది అంటూ కితాబు
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget