అన్వేషించండి

NEET Results 2022 : నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 2, 3 ర్యాంకులు సాధించాం- శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ

NEET Results 2022 : నీట్ ఫలితాల్లో టాప్ 50 లో 8 మంది తెలుగు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. నీట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు మంచి ర్యాంకుల సాధించారని ఆ సంస్థ డైరెక్టర్ సుష్మ తెలిపారు.

NEET Results 2022 : నీట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం అర్ధరాత్రి విడుదల అయిన నీట్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియా 2, 3 ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5, 7, 8 ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల సంస్థల డైరెక్టర్ సుష్మ తెలిపారు. మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఆమె మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్షలో మరోసారి శ్రీ చైతన్య విద్యార్థులు తమ ప్రతిభ చాటారన్నారు. ఆల్ ఇండియా 2, 3 ర్యాంకులు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5,7,8 ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో వందలోపు 17 ర్యాంకులు, ఇతర కేటగిరీలలో పదిలోపు 14, వందలోపు 69 ర్యాంకులు సాధించారన్నారు.  

దిల్లీ ఎయిమ్స్ కు 25 శాతం మంది విద్యార్థులు 

నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తున్నామని సుష్మ తెలిపారు. అనితర సాధ్యమైన ప్రోగ్రాంలు, ఇంటర్నల్ ఎగ్జామ్స్, మైక్రో షెడ్యూల్ లతో అద్బుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. నీట్ కు డిమాండ్ పెరిగిందని, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి మంచి ర్యాంకులు సాధిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో మంచిగా రాసిన విద్యార్థులే పోటీ పరీక్ష లో బాగా రాణిస్తారన్నారు. అన్ని కాంపిటేటివ్ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టింస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం దిల్లీ ఎయిమ్స్ కు శ్రీ చైతన్య నుంచి 25 శాతం మంది విద్యార్థులు డాక్టర్ చదువు కోసం వెళ్లుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 8 వేల సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. 

నీట్ లో తెలుగు విద్యార్థులు హవా 

నీట్​ ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 25వ ర్యాంకు సాధించారు. బాలికల్లో  వెంకటసాయి వైష్ణవి 6వ స్థానం, చప్పిడి లక్ష్మీ చరిత 14 స్థానం, వరుం అతిథి 20 స్థానం సాధించారు. బాలురు విభాగంలో ఎర్రబెల్లి సిద్ధార్థరావు 3వ స్థానం, మట్టాదుర్గాసాయి కీర్తి తేజ 8వ స్థానం, గుల్లా హర్షవర్ధన్‌ నాయుడు 14వ స్థానం సాధించారు.  

టాప్ 50లో 8 మంది 

నీట్ ఫలితాల్లో టాప్‌ 50లో 8 మంది తెలుగు విద్యార్థులు స్థానం సాధించారు. 705 మార్కులతో మంగసముద్రం హర్షిత్‌రెడ్డి 36వ ర్యాంకు, అదే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మి చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సాధించారు.  దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలోనే తొలిర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన జూటూరి నేహ 695 మార్కులతో ఆల్‌ఇండియాలో 134 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10వ స్థానంలో నిలిచారు. ఎస్సీ కేటగిరిలో ఏపీకి చెందిన చెందిన కొమ్ము ఆదర్శ్‌ 685 మార్కులతో జాతీయ స్థాయిలో 7 ఆలిండియా ర్యాంకు విభాగంలో 453వ స్థానం సాధించారు.  

Also Read : NEET Toppers: నీట్ 2022 ఫలితాల్లో 56.27 శాతం ఉత్తీర్ణత, టాప్-10లో తెలంగాణ విద్యార్థి!

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget