అన్వేషించండి

Mains 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా.. 8 మందికి వంద పర్సంటైల్..

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధిస్తే.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు 8 మంది ఉన్నారు.

జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధిస్తే.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. వీరిలో నలుగురు తెలంగాణ, నలుగురు ఏపీకి చెందిన వారుగా ఉన్నారు.

100 పర్సంటైల్ సాధించిన వారిలో కరణం లోకేష్‌ (ఆంధ్రప్రదేశ్‌), దుగ్గినేని వెంకట ఫణీష్‌ (ఆంధ్రప్రదేశ్‌), పాసాల వీర శివ (ఆంధ్రప్రదేశ్‌), కంచనపల్లి రాహుల్‌ నాయుడు (ఆంధ్రప్రదేశ్‌), పోలు లక్ష్మీ సాయి లోకేష్‌ రెడ్డి (తెలంగాణ), మాదుర్‌ ఆదర్శ్‌ రెడ్డి (తెలంగాణ), వెలవలి కార్తికేయ సాయి వైదిక్‌ (తెలంగాణ), జోష్యుల వెంకట ఆదిత్య (తెలంగాణ) ఉన్నారు. 

బాలికల విభాగంలో టాప్ 10 స్థానాల్లో ఐదుగురు తెలుగు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య, పల్లె భావన, గసడ శ్రీ లక్ష్మి, అంచ ప్రణవిలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనస్వితా రెడ్డి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ పరీక్షలను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 7.09 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు నిర్వహించిన జేఈఈ మొదటి విడత పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా 100 పర్సంటైల్ సాధించలేదు. ఇక రెండో విడతలో మొత్తం 13 మంది 100 పర్సంటైల్ సాధించగా.. వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. మూడో విడతలో మాత్రం రికార్డు స్థాయిలో 8 మంది ఉన్నారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాలను jeemain.nta.nic.in, ntaresults.nic.in, nta.ac.in వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి. స్కోర్ కార్డులో అభ్యర్థి సాధించిన మొత్తం మార్కులు, అభ్యర్థి పేరు, పేరెంట్స్ పేరు, అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్, కేటగిరీతో పాటు సబ్జెక్టుల వారీగా ఎన్టీఏ స్కోరు ఉంటాయి. 

ఆగస్టు 26, 27 తేదీల్లో నాలుగో సెషన్.. 
జేఈఈ మెయిన్ పరీక్షల నాలుగో సెషన్ ఈ నెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ.. పరీక్ష నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, గతంలో నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ పరీక్ష జూలై 3న జరగాల్సి ఉంది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్ష వాయిదా పడింది.  

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించనుంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. జేఈఈ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.nta.ac.in, jeemain.nta.nic.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
IPL 2025 SRH VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ పై ముంబై ఆధిప‌త్యం.. వారంలో రెండోసారి విజ‌యం.. రాణించిన రోహిత్, బౌల్ట్, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ చిత్తు
స‌న్ రైజ‌ర్స్ పై ముంబై ఆధిప‌త్యం.. వారంలో రెండోసారి విజ‌యం.. రాణించిన రోహిత్, బౌల్ట్, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
IPL 2025 SRH VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ పై ముంబై ఆధిప‌త్యం.. వారంలో రెండోసారి విజ‌యం.. రాణించిన రోహిత్, బౌల్ట్, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ చిత్తు
స‌న్ రైజ‌ర్స్ పై ముంబై ఆధిప‌త్యం.. వారంలో రెండోసారి విజ‌యం.. రాణించిన రోహిత్, బౌల్ట్, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ చిత్తు
Prakash Raj: ప్రకాష్ రాజ్ గారూ... మీరెక్కడ? మీ 'జస్ట్ ఆస్కింగ్'కి ఏమైంది? పహల్గాం ఉగ్రదాడిపై స్పందించరే?
ప్రకాష్ రాజ్ గారూ... మీరెక్కడ? మీ 'జస్ట్ ఆస్కింగ్'కి ఏమైంది? పహల్గాం ఉగ్రదాడిపై స్పందించరే?
Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
Embed widget