అన్వేషించండి

Mains 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా.. 8 మందికి వంద పర్సంటైల్..

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధిస్తే.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు 8 మంది ఉన్నారు.

జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధిస్తే.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. వీరిలో నలుగురు తెలంగాణ, నలుగురు ఏపీకి చెందిన వారుగా ఉన్నారు.

100 పర్సంటైల్ సాధించిన వారిలో కరణం లోకేష్‌ (ఆంధ్రప్రదేశ్‌), దుగ్గినేని వెంకట ఫణీష్‌ (ఆంధ్రప్రదేశ్‌), పాసాల వీర శివ (ఆంధ్రప్రదేశ్‌), కంచనపల్లి రాహుల్‌ నాయుడు (ఆంధ్రప్రదేశ్‌), పోలు లక్ష్మీ సాయి లోకేష్‌ రెడ్డి (తెలంగాణ), మాదుర్‌ ఆదర్శ్‌ రెడ్డి (తెలంగాణ), వెలవలి కార్తికేయ సాయి వైదిక్‌ (తెలంగాణ), జోష్యుల వెంకట ఆదిత్య (తెలంగాణ) ఉన్నారు. 

బాలికల విభాగంలో టాప్ 10 స్థానాల్లో ఐదుగురు తెలుగు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య, పల్లె భావన, గసడ శ్రీ లక్ష్మి, అంచ ప్రణవిలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనస్వితా రెడ్డి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ పరీక్షలను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 7.09 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు నిర్వహించిన జేఈఈ మొదటి విడత పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా 100 పర్సంటైల్ సాధించలేదు. ఇక రెండో విడతలో మొత్తం 13 మంది 100 పర్సంటైల్ సాధించగా.. వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. మూడో విడతలో మాత్రం రికార్డు స్థాయిలో 8 మంది ఉన్నారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 3 ఫలితాలను jeemain.nta.nic.in, ntaresults.nic.in, nta.ac.in వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి. స్కోర్ కార్డులో అభ్యర్థి సాధించిన మొత్తం మార్కులు, అభ్యర్థి పేరు, పేరెంట్స్ పేరు, అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్, కేటగిరీతో పాటు సబ్జెక్టుల వారీగా ఎన్టీఏ స్కోరు ఉంటాయి. 

ఆగస్టు 26, 27 తేదీల్లో నాలుగో సెషన్.. 
జేఈఈ మెయిన్ పరీక్షల నాలుగో సెషన్ ఈ నెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ.. పరీక్ష నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, గతంలో నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ పరీక్ష జూలై 3న జరగాల్సి ఉంది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్ష వాయిదా పడింది.  

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించనుంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. జేఈఈ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.nta.ac.in, jeemain.nta.nic.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!

వీడియోలు

IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Latest News: తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
Embed widget