అన్వేషించండి

JEE Advanced 2021 Exam Date: అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష..

JEE Advanced 2021 Exam Date: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను  అక్టోబర్‌ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను  అక్టోబర్‌ 3వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పూర్తి స్థాయిలో పాటిస్తూ.. పరీక్ష నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. గతంలో నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ పరీక్ష జూలై 3వ తేదీన జరగాల్సి ఉంది.

అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షను వాయిదా వేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహించనుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. జేఈఈ పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం  www.nta.ac.in, jeemain.nta.nic.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.
మారిన జేఈఈ మెయిన్‌ చివరి విడత తేదీలు..  
జేఈఈ మెయిన్‌ పరీక్ష చివరి విడత తేదీలు ఇటీవల మారాయి. మూడో విడత పరీక్షలను జూలై 20 నుంచి 25 వరకు, చివరి విడత పరీక్షలను జూలై 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మూడో విడత పూర్తయిన వెంటనే ఒక రోజు గ్యాప్‌తో చివరి విడత పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది. పరీక్షల మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని విద్యార్థులు కోరడంతో చివరి విడత పరీక్ష తేదీలను మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చివరి విడత పరీక్షలను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1,2 తేదీల్లో నిర్వహిస్తామని ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల వెల్లడించారు. 
జేఈఈ మెయిన్స్ లో మహారాష్ట్ర అభ్యర్థులకు ఊరట.. 
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని కొల్హాపూర్, పాల్ఘర్, రత్నగిరి, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, సంగ్లి & సతారా ప్రాంతాల్లోని అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్‌ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కు సూచించారు. దీనికి సంబంధించిన తేదీలను ఎన్‌టీఏ త్వరలోనే ప్రకటిస్తుందని తెలుపుతూ.. మంత్రి ట్వీట్ చేశారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం 011-40759000 నంబరు లేదా jeemain@nta.ac.in ఈమెయిల్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget