అన్వేషించండి

'నిఘా' నీడలో పదో తరగతి పరీక్షలు, అధికారులకు ఎగ్జామ్స్ డైరెక్టర్ కీలక ఆదేశాలు!

రాష్ట్రంలోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశ లేకుండా ఏర్పాట్లు చేస్తుంది.

➥ ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్న 5.1లక్షల మందికిపైగా విద్యార్థులు 

➥ ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు పరీక్షల నిర్వహణ

రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశ లేకుండా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించింది. సీల్‌ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్‌ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్‌ చేసే ప్రక్రియనంతా సీసీ కెమెరాలలో రికార్డు చేయాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల డైరెక్టర్ విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్ష పేపర్ల లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కెమెరాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వబడుల సెంటర్లన్నింటిలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ కృష్ణారావు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5.1లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

సీసీ కెమెరాల వినియోగం, పర్యవేక్షణ ఇలా..

➥ పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్‌, 30 మీటర్ల రేంజ్‌, 180 డిగ్రీల వరకు కవర్‌చేసేలా సీసీ కెమెరా ఉండాలి.

➥ సీసీటీవీ పుటేజీలకు మానిటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

➥ చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీసీటీవీ ఫుటేజీని సీల్డ్‌ కవర్‌లో భద్రపరిచి డీఈవోలకు అందజేయాలి.

➥ ఒక్కో కెమెరా కిరాయికి రూ.586, కొనుగోలు చేయాలనుకొంటే రూ.6,900 వెచ్చించవచ్చు.

➥ పరీక్షల్లో రికార్డు అయిన డేటాను నిక్షిప్తంచేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత సాఫ్ట్‌కాపీని భద్రపరచాలి.

➥ సీసీటీవీ కెమెరాల కొనుగోలు లేదా కిరాయి కోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.

➥ ప్రైవేట్‌ బడుల సెంటర్లలో ఆయా యాజమాన్యాలు సొంతంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.

Also Read:

ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘విద్యా హక్కు’ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు మార్చి 4న నోటిఫికేషన్ వెలువడింది. ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు 18 నుంచి ఏప్రిల్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరుగనుంది. మొదటి జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 189 గురుకులాల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Bengal Politics: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Embed widget