News
News
వీడియోలు ఆటలు
X

Fact Check CBSE : సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాలు మంగళవారం వస్తాయంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఫ్యాక్ట్ చెక్‌లో అది ఫేక్ అని తేలింది. ఎలాంటి రిజల్ట్‌ను సీబీఎస్‌ఈ 25వ తేదీన ప్రకటించడం లేదు.

FOLLOW US: 
Share:

సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో నిర్ధారించుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఫేక్ చేయాలనుకునేవాళ్లు ..  అది ఫేక్ కాదు నిజం అని నమ్మించడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తారు. ఇలాంటివి  ప్రతీ రోజూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. నమ్మిన వాళ్లను బకరాను చేస్తూ ఉంటాయి. 

తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ సీబీఎస్ఈ  పన్నెండో తరగతి ఫలితాలను జనవరి 25వ తేదీన విడుదల చేయబోతోందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి సీబీఎస్‌ఈనే విడుదల చేసినట్లుగా చూపిస్తున్న ఓ సర్క్యూలర్‌ను కూడా ప్రచారంలోకి పెట్టారు. ఆ సర్క్యులర్ చూస్తే అచ్చంగా సీబీఎస్‌ఈ విడుదల చేసినట్లుగానే ఉంది. దాన్ని చూస్తే నిజంగానే రిజల్ట్స్ వస్తున్నాయేమోనని అనుకుంటారు. కానీ ఫేక్ అని భారత ప్రభుత్వానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించింది. 

 

Also Read: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?

సీబీఎస్‌ఈకి సంబంధించి గతంలో అనేక ఫేక్ ప్రచారాలు జరిగాయి. సీబీఎస్ఈ విధానంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారందర్నీ  గందరగోళంలో పడేసేందుకు ఫేక్‌ పోస్టులు క్రియేట్ చేసే వారు ప్రయత్నిస్తున్నారు. వారందరికీ ఎప్పటికపపుడు అవగాహన కల్పించి.. పేక్ పోస్టులు ఏవో నిరందరం అప్ డేట్ చేస్తూందో పీఐబీ. 

Also Read:  ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! ఏయే రోజుల్లోనంటే!

కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగకపోవడం.. వివిధ కారణాల వల్ల విద్యార్థులు కూడా ఇలాంటి వాటి పట్ల ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తిని కనిపెట్టి.. తప్పుడు సమాచారాన్ని పంపుతున్నారు కొంత మంది వ్యక్తులు. దీనిపై విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

Also Read: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 

 
Published at : 25 Jan 2022 03:27 PM (IST) Tags: CBSE CBSE Results Fact Check Fake News on CBSE Results Delhi CBSE Results Fact Check

సంబంధిత కథనాలు

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ