అన్వేషించండి

Degree Results: యూనివర్సిటీల నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థులకు తిప్పలు, విద్యాసంవత్సరం ఆలస్యం!

తెలంగాణలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో కొన్ని విశ్వవిద్యాలయాల నిర్లక్ష్యం వల్ల విద్యాసంవత్సరం (2023-24) చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యేలా పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు డిగ్రీ ఫలితాల రూపంలో కష్టకాలం నెలకొంది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో కొన్ని విశ్వవిద్యాలయాల నిర్లక్ష్యం వల్ల విద్యాసంవత్సరం (2023-24) చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యేలా పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా.. డిగ్రీ ఫలితాలు వెల్లడికాకపోవడంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించలేకపోతున్నారు. ఇప్పటికైతే ఎంసెట్‌, ఈసెట్‌ కౌన్సెలింగ్‌లు మాత్రమే కొనసాగుతున్నాయి.

ఆయా ప్రవేశాలను సంబంధించి ఒక్కొక్కటిగా కౌన్సెలింగ్ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అక్టోబరు, నవంబరు వరకు ఆయా కౌన్సెలింగ్‌లు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ సీట్ల భర్తీకి పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించినా వెబ్‌ ఆప్షన్లు మాత్రం మొదలుకాలేదు. దీనికి కారణం కాకతీయ వర్సిటీ పరిధిలో బీఫార్మసీ ఫలితాలు వెల్లడికాకపోవడమే. ఆ వర్సిటీ ఇప్పటివరకు ఎంఫార్మసీ కళాశాలల జాబితాను కూడా ఉన్నత విద్యామండలికి పంపలేదు. ఇటీవల షెడ్యూలును సవరించి ఆగస్టు 28 నుంచి వెబ్‌ ఆప్షన్లు ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించడం విద్యార్థులకు ఊరట కలిగించే విషయం.

మరోవైపు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 14 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభంకావాల్సి ఉండగా.. సెప్టెంబరు 6కు వాయిదా వేశారు. ఇందుకు కారణం ఓయూ, కాకతీయ పరిధిలో డిగ్రీ ఫలితాల వెల్లడిలో ఆలస్యమే.‌ ఏటా న్యాయవిద్య కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) అనుమతులు ఆలస్యమవుతున్నాయని చెప్పే అధికారులు.. ఈసారి కళాశాలల జాబితానే ఆ సంస్థకు ఇప్పటివరకు పంపకపోవడం గమనార్హం. ఉన్నత విద్యామండలి అధికారులు చొరవ తీసుకొని త్వరగా కౌన్సెలింగ్‌లను ప్రారంభించాలని అభ్యర్థులు కోరుతున్నారు. కొందరు ఉద్యోగాలకు ఎంపికైనా.. ఫలితాలు రాకపోవడంతో ధ్రువపత్రాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

ఈ విద్యాసంవత్సరం తరగతులు సకాలంలోనే ప్రారంభమవుతాయని అంతా భావించారు. అయితే డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదితర కోర్సుల చివరి సంవత్సరం, రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆలస్యంగా జరగడంతో వాటి ఫలితాలు కొంత ఆలస్యం కావొచ్చని భావించిన ఉన్నత విద్యామండలి ఆయా ప్రవేశ పరీక్షల ఫలితాల వెల్లడిలోనూ ఉదాసీనంగా వ్యవహరించింది. ఓయూలో బీకాం, బీఏ చివరి సంవత్సరం ఫలితాలు ఇచ్చినా.. బీఎస్సీ, బీఏ కోర్సుల ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో డిగ్రీతో ముడిపడిన ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ కౌన్సెలింగ్‌ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు. ‌ఇటీవల కురిసిన వర్షాలతో అర్ధంతరంగా పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది. మధ్యలో సీపీగెట్‌ పరీక్షలు కూడా అడ్డంకిగా మారాయి. మళ్లీ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి నిర్వహించాం. మూల్యాంకనాన్ని వేగంగా చేస్తున్నాం. ఈ నెలాఖరులోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ALSO READ:

పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు జారీ, 18లోపు పూర్తికావాలి
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ ఆగ‌స్టు 14న ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ప్రైమరీ, మండల పరిషత్ ప్రైమరీ, మున్సిపల్‌ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులు, అవసరమైన ఉపాధ్యాయుల జాబితాను జులై 31వ తేదీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ ఆధారంగా జిల్లా విద్యాశాఖకు అందించాలని తెలిపారు. 84, 85, 117, 128, 47, 60 జిఓల ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని సూచించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Who is Sameer Minhas: వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
Embed widget