అన్వేషించండి

National Education Policy: దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాల్సిందే, తాజాగా ఆదేశాలు ఇవే!

కేంద్రప్ర‌భుత్వం అమలుచేస్తున్న జాతీయవిద్యావిధానం దేశ‌వ్యాప్తంగా అమ‌లు కావ‌డం ఖాయమైపోయింది. ఇప్ప‌టికీ కొన్ని రాష్ట్రాలు ఈ విద్యావిధానంలోకి మారలేదు. అయితే తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాల‌నూ ఆదేశించింది.

National Education Policy: కేంద్రం(Centre)లోని న‌రేంద్ర మోడీ(PM Narendramodi) ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జాతీయ నూత‌న విద్యావిధానం(National Education Policy-NEP) అమ‌లు ఇక‌, దేశ‌వ్యాప్తంగా పరుగులు పెట్ట‌నుంది. నిజానికి దీనిని తీసుకువ‌చ్చి చాన్నాళ్లే అయినా.. కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికీ అమ‌లు దిశ‌గా అడుగులు వేయ‌లేదు. దీనికి కార‌ణం కొన్ని కొన్ని కీల‌క సంస్క‌ర‌ణ‌లు.. ఆయా రాష్ట్రాల‌కు రాజ‌కీయంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు జాతీయ నూత‌న విద్యావిధానం వైపు మొగ్గు చూప‌డం లేదు. అందుకే.. ఇప్పుడు రాష్ట్రాల నిర్ణ‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రం మాత్రం స‌వివ‌ర‌మైన ఆదేశాలు జారీ చేసింది. దీనిని త‌ప్పకుండా అన్ని రాష్ట్రాలు పాటించాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. 

జనవరి 2015లోనే జాతీయ విద్యావిధానానికి(NEP) బీజం ప‌డింది. అది ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ బాధ్య‌త‌లు తీసుకున్న తొలినాళ్లు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశ‌వ్యాప్తంగా ఒకే విద్యావిదానం ఉండాల‌న్న ల‌క్ష్యంతో దీనిని తీసుకువ‌చ్చారు. మాజీ క్యాబినెట్ కార్యదర్శి T. S. R. సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని కమిటీ కొత్త విద్యా విధానం కోసం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. కమిటీ నివేదిక ఆధారంగా, జూన్ 2017లో ముసాయిదా NEPని కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించింది. అయితే.. దీనిపై విప‌క్షాలు, రాష్ట్రాలు అభ్యంత‌రం చెప్ప‌డంతో మ‌రోసారి దీనిని అధ్య‌యనం చేయించారు. ఆ త‌ర్వాత‌..  నూతన విద్యా విధానం(NEP) 2020లో ఆమోదించారు.  

త్రిభాషా సూత్రం..!

జాతీయ విద్యా విధానం-2020(NEP) ప్ర‌కారం.. 5వ తరగతి వరకు మాతృభాష(Mother tongue) లేదా స్థానిక భాషను బోధనా మాధ్యమంగా ఉంచి తీరాలి. 8వ తరగతి త‌ర్వాత నుంచి ఏ మాధ్య‌మమైనా ఇబ్బంది లేదు.  సంస్కృతం, విదేశీ భాషలకు కూడా జాతీయ విద్యా విధానం ప్రాధాన్యత ఇచ్చింది. 'త్రి భాషా సూత్రం' ప్రకారం విద్యార్థులందరూ తమ పాఠశాలలో మూడు భాషలను నేర్చుకోవాలని తేల్చి చెప్పింది. మూడు భాషల్లో కనీసం రెండు భాషలైనా నేర్చుకోవాల‌నేది ఈ బిల్లు ప్ర‌ధాన ఉద్దేశం. అయితే.. ఇదే వివాదానికి దారి తీసింది. త‌మిళ‌నాడు స‌హా క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ ఎత్తున ఉద్య‌మాలు సాగాయి. 

కేంద్రం తాజా  ఆదేశాలు ఇవీ.. 

జాతీయ విద్యావిదానం మేర‌కు 1వ తరగతిలో(School) ప్రవేశానికి  కనీస వయోపరిమితిని పాటించాల్సి ఉంటుంది.  1వ తరగతిలో ప్రవేశానికి పిల్లల వయస్సు కనీసం 6 సంవత్సరాలు నిండి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి దీనిని అమ‌లు చేయాల‌ని  పేర్కొంది.  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత‌ల్లో గ్రేడ్-1లో ప్రవేశానికి పిల్లల వయస్సు 6+ గా ఉండాల్సిం దేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా అస్సాం, గుజరాత్, పుదుచ్చేరి, తెలంగాణ, లడఖ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ సహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పిల్లలకు కనీసం 6 ఏళ్లు నిండి ఉంటేనే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. చిన్నారుల విద్య విష‌యంలో.. మొదటి ఐదు సంవత్సరాలలో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల వారికి సంబంధించిన మూడు సంవత్సరాల ప్రీస్కూల్, ఆరేళ్ల వయస్సు నుంచి ఎనిమిదేళ్ల వరకు రెండు సంవత్సరాల 1, 2 తరగతులు ఉంటాయి.  

వివాదాలు ఇవీ.. 

+ త్రిభాషా సూత్రాన్ని అమ‌లు చేస్తుండ‌డంతో భాషా ప్ర‌యుక్త రాష్ట్రాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. 

+ జాతీయ నూత‌న విద్యా విధానాలో ఉపాధ్యాయుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం.. 50 మంది చిన్నారులు (విద్యా ర్థులు..) ఉన్న పాఠ‌శాల‌ల‌ను విలీనం చేయ‌డం..  కూడా విలీనం చేయ‌డం గ‌మ‌నార్హం. 

+ ఉపాధ్యుల-విద్యార్థుల నిష్ప‌త్తిని పెంచ‌డం. త‌ద్వారా టీచ‌ర్ పోస్టుల‌ను త‌గ్గించ‌డం. 

+ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో 4-సంవత్సరాల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది.  

టాప్ హెడ్ లైన్స్

UPSC Prelims 2026: యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget