అన్వేషించండి

CBSE: రెండు టర్మ్‌లుగా బోర్డు పరీక్షలు.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం..

CBSE Board: 10, 12 తరగతుల బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజిస్తున్నట్లు వెల్లడించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021 -22 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ సరికొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా గతేడాది బోర్డు పరీక్షలు నిర్వహించలేకపోవడంతో భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాదికి 10, 12 బోర్డు పరీక్షలకు ప్రత్యేక మూల్యాంకన విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపింది. 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా (టర్మ్‌లుగా) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి అనుగుణంగా సిలబస్‌ను క్రమబద్ధీకరిస్తామని వివరించింది. నవంబర్-డిసెంబరులో టర్మ్-1 పరీక్షలను, మార్చి-ఏప్రిల్‌లో టర్మ్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సీబీఎస్ఈ డైరెక్టర్ (అకడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ విడుదల చేశారు. 
పరీక్ష విధానం..
తొలి టర్మ్‌లో బహుళ ఐచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలే ఉంటాయి. ఒక్కో పరీక్ష నిడివి 90 నిమిషాలు ఉంటుంది. రెండో టర్మ్ పరీక్షలను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించనుంది. దీనికి రెండు గంటల కాలవ్యవధి ఉండనుంది. ఈ విధానంలో వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉండనున్నాయి. ఒకవేళ డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహిచండం సాధ్యం కాకపోతే.. మొదటి టర్మ్ తరహాలోనే పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ భావిస్తోంది. ఈ రెండు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది మార్కులను కేటాయించనుంది. ఇలా చేయడం వల్ల సిలబస్ భారం ఎక్కువ ఉండదని భావించింది. ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితులు చక్కబడితే పూర్తి స్థాయి సిలబస్‌తో మొదటి టర్మ్ పరీక్షలు అక్టోబరు-నవంబరులో, రెండో టర్మ్ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. 
త్వరలో సిలబస్‌పై స్పష్టత.. 
2021–22 విద్యాసంవత్సరం సిలబస్‌పై సీబీఎస్ఈ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత విద్యా సంవత్సరం మాదిరిగా దీనిని క్రమబద్ధీకరించి ఈ నెలలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు విద్యా ప్రణాళికలను కొనసాగించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) నుంచి ప్రత్యామ్నాయ అకాడమిక్‌ క్యాలెండర్, ఇన్‌పుట్స్‌ని తీసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది. కాబట్టి త్వరలోనే సిలబస్‌పై స్పష్టత రానుంది. 'మొదటి టర్మ్ సిలబస్ రెండో టర్మ్ సిలబస్ వేర్వేరుగా ఉండనుంది. మొదటి టర్మ్ సిలబస్ రెండో టర్మ్ పరీక్షలో ఉండదు. విద్యార్థులకు ఏ టర్మ్ పరీక్షకు ఉద్దేశించిన సిలబస్ ఆ టర్మ్ లోనే భోధించనున్నారు' అని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. 
పలు పరీక్షల రద్దు చేయడంతో.. 
కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు గతేడాది కొన్ని సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటివి మరోమారు జరగకుండా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరపాలని భావిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం కోసం సిలబస్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్‌ వర్క్‌లను మరింత పారదర్శకంగా చేసేందుకు నూతన ప్రణాళికలను అనుసరించనుంది. 

టాప్ హెడ్ లైన్స్

NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Ananya Nagalla : అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
Embed widget