అన్వేషించండి

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,221 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ హాల్‌‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ పేరు, జిల్లాపేరు, స్కూల్ వివరాలు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. జవాబు పత్రాల ముల్యాంకనం జూన్‌ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ చివరివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

విద్యార్థులకు సూచనలు..

➥ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

➥ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

➥ క్వశ్చన్ పేపర్‌ను చదువుకోవడానికి 15 నిమిషాల సమయం ఉంటుంది.

➥ పరీక్షలో కాపీయింగ్ చేయడం, చీటింగ్ వంటి పనులు చేయడం విరుద్ధం, పట్టుబడితే డీబార్ చేస్తారు.

➥ దివ్యాంగులకు పరీక్షలు రాయడానికి అరగంట సమయం అదనంగా ఉంటుంది.

➥ పరీక్ష సమయం ముగిసే వరకు విద్యార్థులను బయటకు పంపరు, కాబట్టి.. విద్యార్థులు తమ జవాబు పత్రాలను క్షుణ్నంగా పరిశీలించుకోవాలి

పరీక్షల షెడ్యూలు ఇలా..

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

జూన్ 2న: తెలుగు పరీక్ష

జూన్ 3న: హిందీ పరీక్ష

జూన్ 5న: ఇంగ్లిష్ పరీక్ష

జూన్ 6న: గణితం పరీక్ష

జూన్ 7న: సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయాలజీ) పరీక్ష

జూన్ 8న: సోషల్ స్టడీస్ పరీక్ష

జూన్ 9న: కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1 పరీక్ష

జూన్ 10న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష. 

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 6న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,64,152 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం నిర్వహించారు. అనంతరం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్‌ పెరిగింది. అది 3.47 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్‌ పర్సంటేజ్‌ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్‌ 60.39శాతం. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 938 స్కూల్స్‌ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్‌ ఉంటే...  2,95,807 మంది బాలికలు ఉన్నారు. 

Also Read:

తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Nepal Gen Z outcry: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
Tesla drops: అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
Adilabad Cement Factory: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
TG CPGET Results: తెలంగాణ CPGET ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే! 
తెలంగాణ CPGET ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే! 
Embed widget