అన్వేషించండి

AP School Education : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం, ఆ పాఠశాలలు హైస్కూల్ ఫ్లస్ గా అప్ గ్రేడ్

AP School Education : ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక మార్పు తీసుకోస్తుంది. రాష్ట్రంలోని 292 హైస్కూళ్లను హైస్కూల్ ఫ్లస్ గా అప్ గ్రేడ్ చేస్తుంది. వీటిని బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తుంది.

AP School Education : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ఫ్లస్‌గా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్ లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు తెలిపింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌తో కోర్సులు నిర్థారించాలని సంబంధిత శాఖ ఆదేశించింది. పీజీటీ సమానస్థాయి అధ్యాపకులను హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 1752 స్కూల్‌ అసిస్టెంట్లను 292 జూనియర్‌ కళాశాలల్లో పనిచేసేందుకు నియమిస్తున్నట్లు తెలిపింది. ఆ పాఠశాలల్లో నాడు-నేడు పనులు చేసిన కారణంగా అదనపు తరగతి గదులను మంజూరు చేయమబోమని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

అకడమిక్ కేలండర్ విడుదల 

ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు జులై 5 ప్రారంభమై ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగుతుందని విద్యాశాఖ ప్రకటించింది. జులై 4వ తేదీన పాఠశాలలు తెరవాలని భావించారు. కానీ జులై 4 ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండడంతో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. 80 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏపీ అకడమిక్ కేలండర్ ను రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(SCERT) ప్రకటించింది. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.

ఈ ఏడాది పరీక్షలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూలును ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. సెప్టెంబరులో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు, అక్టోబర్ లో ఫార్మేటివ్‌-2 పరీక్షలు, నవంబర్, డిసెంబరులో సమ్మేటివ్‌-1, వచ్చే ఏడాది జనవరిలో ఫార్మేటివ్‌-3 పరీక్షలు, ఫిబ్రవరిలో ఫార్మేటివ్‌-4 పరీక్షలు, పదో తరగతి ప్రీ ఫైనల్‌ ఫిబ్రవరి 22 నుంచి ఉంటాయని తెలిపింది. సమ్మేటివ్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. జీవో 117లో పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించింది. పాఠశాలల ప్రారంభం నాటికి ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం, తరగతి గదులను అలంకరించడం లాంటివి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. పాత పుస్తకాలను సేకరించి బుక్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని తెలిపింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget