అన్వేషించండి

AP SSC Exams: ఏప్రిల్ 1 నుంచి పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం - ఈసారి ముందుగానే ఫలితాలు?

ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 8 వరకు మూల్యాంకనం కొనసాగనుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

10th class paper valuation: ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన (పేపర్ వాల్యూయేషన్) ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 8 వరకు మూల్యాంకనం కొనసాగనుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ మూల్యాంకనం నిర్వహించనున్నట్లు సురేష్ వెల్లడించారు. మొత్తం 25 వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 7.25 లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6.23 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు 1.02 పూర్వవిద్యార్థులు ఉన్నారు.

మే మొదటి వారంలోనే ఫలితాలు..
మే మొదటి వారానికి మూల్యాంకన ప్రక్రియ అంతా పూర్తిచేసి, ఎన్నికల కమిషన్‌ అనుమతితో, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని ష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద్‌ రెడ్డి తెలిపారు. మూల్యాంకనం కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని దేవానంద్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో గతంలో నిర్వహించిన చోట సరైన సౌకర్యాలు లేవని గుర్తించి, ఈసారి వాటిని అనువైన భవనాల్లోకి మార్పు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేషన్‌తో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.

ప‌దోతరగతి ప‌రీక్ష పేప‌ర్ల మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా­రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చా­మని దేవానంద్‌ తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్‌ లింక్‌ ద్వారా వారి సెల్‌ఫోన్‌కు మూల్యాం­కనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రాలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు దేవానంద్‌ రెడ్డి. ఇందు కోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

పదోతరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

Step 1 : పదోతరగతి ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి - bse.ap.gov.in

Step 2 : అక్కడ హోంపేజీలో 'ఫలితాలకు' సంబంధించిన లింక్‌‌పై క్లిక్ చేయాలి.

Step 3 :  అక్కడ వివరాలు నమోదు చేసి, Submit బటన్‌ మీద క్లిక్ చేాయాలి.

Step 4 : పదోతరగతి ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

Step 5 : విద్యార్థులు తమ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి

ALSO READ:

అనాథ చిన్నారులకు 'హీల్ ప్యారడైజ్' ఆపన్నహస్తం - ఉచిత చదువు, వసతి సదుపాయాలు
తల్లితండ్రులను కోల్పోయి లేదా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురయ్యే చిన్నారులకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని 'హీల్ ప్యారడైజ్' పాఠశాల చేయూతనిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కి.మీ. దూరంలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ పాఠశాలలో అనాథ పిల్లలకు ఉచిత విద్యతోపాటు.. వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. కార్పొరేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలో ఏ ప్రాంతంవారైనా ఇక్కడ చేరవచ్చని.. హీల్ ప్యారడైజ్ పాఠశాల నిర్వాహకుడు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈవో కె.అజయ్ కుమార్ తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్! అరెస్టు ఖాయమంటున్న అభిజీత్! 
బొద్దింక పార్టీకి షాక్, కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Embed widget