అన్వేషించండి

ITI Colleges: విద్యార్థులకు 'నైపుణ్య ప్రాప్తిరస్తు' - తొలిదశలో 25 'అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు' అందుబాటులోకి

Skill Development Centres: తెలంగాణలోని ప్రభుత్వ ఐటీఐలలో తొలిదశలో 25 కాలేజీలను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. వచ్చేఏడాది మరో 25 కళాశాలనను ఏటీసీలుగా మార్చనున్నారు.

Advanced Technology Centres in Telangana: తెలంగాణలోని ప్రభుత్వ ఐటీఐలకు మహర్దశ పట్టనుంది. కాలానుగుణంగా ప్రస్తుత ఉద్యోగావసరాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ(ITI)లను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ - ATC) తీర్చిదిద్దాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని మొత్తం 65 ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే.. తొలి దశలో 25 అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జిల్లాల్లోని కొన్ని కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, స్థలాభావం సమస్యలు ఉండటం, మరికొన్ని అద్దె భవనాల్లో ఉండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదికి 25 ఐటీఐలను ఏటీసీలుగా మార్చాలని, వచ్చే ఏడాదికి మరో 25 కళాశాలల్లో ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్‌లో అత్యధికంగా ఐదు ఏటీసీలు అందుబాటులోకి రానున్నాయి. 

టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం.. 
రాష్ట్రంలో ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో దాదాపు రూ.2,700 కోట్ల ఖర్చుతో నైపుణ్య శిక్షణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పలు కోర్సులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరులు, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం 'టాటా టెక్నాలజీస్'తో ఇటీవల ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం కేంద్రాల ఆధునికీకరణ పనులు మొదలుపెట్టారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేసిన ఏటీసీ (ATC) కేంద్రం మూడు నెలల్లోనే అందుబాటులోకి వచ్చేలా వేగంగా పనులు జరుగుతున్నాయి. 

ఉపాధికి గ్యారంటీ...
టాటా టెక్నాలజీస్ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఐటీఐలను 'ఏటీసీ'లుగా తీర్చిదిద్దుతోంది. అక్కడి ప్రభుత్వాల సహకారంతో దిగ్విజయంగా కొనసాగిస్తోంది. టాటా సంస్థ 'పరిశ్రమ 4.0' పేరుతో దీర్ఘకాల, స్వల్వ వ్యవధి కోర్సులతోపాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల కోసం బ్రిడ్జి కోర్సులనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రొడక్ట్ డిజైన్ డెవలప్‌మెంట్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐవోటీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ప్రొడక్ట్ డిజైన్ డెవలప్‌మెంట్, ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ప్రొటోటైపింగ్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఆర్క్ వెల్డింగ్, ఏఐ ఆధారిత వర్చువల్ వెల్డింగ్-పెయింటింగ్ తదితర కోర్సులు ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) గుర్తింపు ఉన్న ఆయా కోర్సులను పూర్తిచేసే వారికి ప్రముఖ కంపెనీల్లో ఉపాధికి ఢోకా ఉండదని సర్కారు భావిస్తోంది. 

ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకం...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే 'ఆధునిక నైపుణ్య కేంద్రాల్లో' కొత్త కోర్సుల బోధనకు సంబంధించి ఒక్కో కేంద్రానికి అదనంగా దాదాపు 12 నుంచి 15 వరకు ఫ్యాకల్టీలు అవసరం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో బోధకుల పోస్టుల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోర్సుల బోధనకు సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని ఉపాధి కల్పన శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణమైన విద్యార్హతలు కలిగిన వారిని ఎంపికచేసే బాధ్యతను టాటా సంస్థకే అప్పగించే అవకాశం ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
Polavaram Left Main Canal: ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
Hydra AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
Nimmagadda Prasad: వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్.. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్.. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
Embed widget