Crime News: వాలెంటైన్స్ డే రోజు దారుణం- యువతిపై యాసిడ్ పోసిన యువకుడు, నారా లోకేష్ సీరియస్
Acid Attack in Annamayya District | వాలెంటైన్స్ డే రోజు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేసి, ఆపై యాసిడ్ పోసి ఓ యువకుడు పరారయ్యాడు.

Valentines Day 2025 | ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. అంతకుముందు ఆమెపై కత్తితో సైతం దాడికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా (Annamayya District) గుర్రంకొండలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. ఆమెకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి యాసిడ్ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రేమికుల దినోత్సవం రోజున యాసిడ్ దాడి
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. మదనపల్లిలో డిగ్రీ చదువుతున్న యువతిపై తోటి విద్యార్థి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న యాసిడ్ పోసి దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. యువతి తలపై కత్తి గాయాలు కాగా, యాసిడ్ పడటంతో ముఖంపై కాలిన గాయాలయ్యాయి. నిందితుడిని గణేష్ అని గుర్తించారు. నిందితుుడు మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన యువకుడిగా సమాచారం. తీవ్ర గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం 108లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతికి వివాహం నిశ్చమైంది. ఏప్రిల్ నెలాఖరులో (29వ తేదీన) ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ప్రేమ పేరుతో ఓ యువకుడు కత్తితో దాడి చేసి, ఆపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Viral News: బాయ్ఫ్రెండ్ అలా చేశాడని డయల్ 100కు కాల్ చేసిన యువతి, సీరియస్గా తీసుకున్న పోలీసులు!
యాసిడ్ బాధితురాలకి అండగా ఉంటాం: నారా లోకేష్
అమరావతి: అన్నమయ్య జిల్లాకు చెందిన యాసిడ్ బాధితురాలి తండ్రి జనార్ధన్ కు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఫోన్ చేసి మాట్లాడారు. యువతి ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఆమె కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందిస్తాం. నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. యాసిడ్ దాడి ఘటనపై నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమ అంటూ దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అమ్మాయిలు, బాలికలపై దాడులకు దిగుతున్న ఇలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. మీ వెంట నేనున్నాను, అధైర్య పడొద్దని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. బాధితురాలు గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అక్కడే ఉన్న మంత్రి మండుపల్లి రాంప్రసాద్ కు మంత్రి లోకేష్ సూచించారు. ఎప్పటికప్పుడూ వివరాలు తనకు అప్డేట్ చేయాలన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

