అన్వేషించండి

Crime News: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు, ఇంట్లో వాళ్లను చంపుతానని బెదిరించడంతో యువతి ఆత్మహత్య

ప్రేమించానన్నాడు.. ప్రేమించకుంటే ఇంట్లో వాళ్ల చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏడు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది.

ఏపీలో ప్రేమ పేరుతో వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన చెన్నం శెట్టి నాగేంద్ర బాబు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా ఆమెను బలవంతం చేస్తూ వచ్చాడు. 

విషయం తెలుసుకున్న పెద్దలు నాగేంద్రను మందలించారు. అయినా నాగేంద్ర వెనక్కి తగ్గలేదు. ఎవరు ఏం చెప్పినా వినలేదు. ఆమె వెంట పడుతూ వచ్చాడు. విషయం మరింత ముదిరిపోతుందని గ్రహించిన అమ్మాయి తరఫు బంధువులు యువతిని అమ్మమ్మ ఇంటికి పంపించారు. 

యువతి వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిందని గ్రహించిన నాగేంద్రం అక్కడికి కూడా వెళ్లాడు. తను ప్రేమించాలని బలవంతం పెట్టారు. రెండు నెలలు ఆ అమ్మయి అక్కడ ఉన్నప్పటికీ నాగేంద్రం తన వేధింపులు మానుకోలేదు. 

అక్కడ తనకు అడిగేవాళ్లు లేరని గ్రహించిన నాగేంద్ర ఫిబ్రవరి ఒకటో తేదీన తన తాతయ్య పత్తి శ్రీను, బావమరిది అనిల్‌తో కలిసి  ఆ యువతిని ఎత్తుకెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్థులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నానికి గండి పడింది. 

కుటుంబం పరువు తీయొద్దని, పెళ్లి కావాల్సిన అమ్మాయికి అన్యాయం చేయద్దని యువతి తరపు బంధువులు ఎంత వేడుకున్నా నాగేంద్ర వదల్లేదు. విషయం తెలుసుకున్న తండ్రి వెళ్లి కుమార్తెను సొంతూరు తీసుకొచ్చాడు. 

సొంతూరు ఆమె వచ్చిందని తెలుసుకున్న నాగేంద్రబాబు... ఈసారి ఆమె ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. అడ్డుగా వచ్చిన ఆమె తండ్రిని చితకబాదాడు. తమ్ముణ్ణి కూడా కొట్టాడు. ఎక్కువ చేస్తే చంపేస్తానని బెదిరించాడు. 

విషయం మరింత సీరియస్ అవుతుందని గ్రహించిన ఆ యువతి భయాందోళనకు గురైంది. తన వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయన్న మనో వ్యధతో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్య చేసుసుకుంది. 

ఈ నెల 2వ తేదీ బుధవారం ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వినుకొండ పట్టణంలోని  ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని తేల్చేశారు. అప్పటి నుంచి 7 రోజులపాటు చికిత్స అందిస్తూ వచ్చారు. 

చికిత్సకు కోలుకుంటుందని భావించిన ఆ యువతి ఫ్యామిలీకి విషాదమే మిగిలింది. చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆ ఫ్యామిలీ బోరుమంటోంది. ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీని నాగేంద్ర చిన్నాభిన్నం చేశాడని ఆరోపిస్తోంది. 

ఈ ఫ్యామిలీని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కచ్చితంగా నాగేంద్రకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇతనికే కాదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎవరు చేసినా కచ్చితంగా కోర్టులో దోషులుగా నిలబెడతామన్నారు పద్మ. 

టాప్ హెడ్ లైన్స్

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget