అన్వేషించండి

Crime News: పండుగ పూట తీవ్ర విషాదం - వినాయక మండపాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

Andhra News: వినాయక చవితి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మండపాలు ఏర్పాటు చేస్తూ ప్రమాదానికి గురై తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Young Men Died Due To Current Shock In AP And Telangana: పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తోన్న క్రమంలో కరెంట్ షాక్‌తో ఏపీ (AP), తెలంగాణలోని (Telangana) వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో (Rayachoti) వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా మహేశ్ (13) అనే బాలుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక టీవీఎస్ షోరూం వెనుక వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుని మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అటు, పల్నాడు జిల్లా ముప్పాళ్లలో వినాయక విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

తిరుమలలో గుండెపోటుతో..

మరోవైపు, తిరుమల క్యూ లైన్‌లో గుండెపోటుతో ఓ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లో శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలగా తోటి భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో ఆమెను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలిని కడప జిల్లా వాసి ఝాన్సీ (32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. అటు, రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో వైద్యునితో పాటు అత్యవసర వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారు.

తెలంగాణలోనూ ఇద్దరు మృతి

తెలంగాణలోనూ (Telangana) వినాయక మండపాలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్ (28) శుక్రవారం రాత్రి వినాయక మండపానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. గత వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో ముందు జాగ్రత్తగా మండపం పైనుంచి వర్షం నీరు కిందకు రాకుండా టార్పాలిన్‌తో కడగడం మొదలుపెట్టాడు. ఓ చేత్తో ఐరన్ బైండింగ్ వైర్ పట్టుకుని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. ఈ క్రమంలో ఆ వైర్ విద్యుత్ తీగలకు తగిలి నవీన్ షాక్‌తో కింద పడి స్పాట్‌లోనే మృతి చెందాడు. నవీన్ కింద పడడం చూసిన మరో వ్యక్తి కర్రతో అతన్ని తప్పించే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. నవీన్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అటు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సీర్సపల్లిలో ఓ ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానిక వినాయక మండపం వద్ద విద్యుత్ బల్బులు సరి చేస్తూ యశ్వంత్ అనే యువకుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Also Read: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భద్రతా వైఫల్యం - మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని, బీసీసీఐ ఆగ్రహం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget