అన్వేషించండి

Crime News: పండుగ పూట తీవ్ర విషాదం - వినాయక మండపాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

Andhra News: వినాయక చవితి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మండపాలు ఏర్పాటు చేస్తూ ప్రమాదానికి గురై తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Young Men Died Due To Current Shock In AP And Telangana: పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తోన్న క్రమంలో కరెంట్ షాక్‌తో ఏపీ (AP), తెలంగాణలోని (Telangana) వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో (Rayachoti) వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా మహేశ్ (13) అనే బాలుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక టీవీఎస్ షోరూం వెనుక వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుని మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అటు, పల్నాడు జిల్లా ముప్పాళ్లలో వినాయక విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

తిరుమలలో గుండెపోటుతో..

మరోవైపు, తిరుమల క్యూ లైన్‌లో గుండెపోటుతో ఓ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లో శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలగా తోటి భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో ఆమెను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలిని కడప జిల్లా వాసి ఝాన్సీ (32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. అటు, రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో వైద్యునితో పాటు అత్యవసర వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారు.

తెలంగాణలోనూ ఇద్దరు మృతి

తెలంగాణలోనూ (Telangana) వినాయక మండపాలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్ (28) శుక్రవారం రాత్రి వినాయక మండపానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. గత వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో ముందు జాగ్రత్తగా మండపం పైనుంచి వర్షం నీరు కిందకు రాకుండా టార్పాలిన్‌తో కడగడం మొదలుపెట్టాడు. ఓ చేత్తో ఐరన్ బైండింగ్ వైర్ పట్టుకుని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. ఈ క్రమంలో ఆ వైర్ విద్యుత్ తీగలకు తగిలి నవీన్ షాక్‌తో కింద పడి స్పాట్‌లోనే మృతి చెందాడు. నవీన్ కింద పడడం చూసిన మరో వ్యక్తి కర్రతో అతన్ని తప్పించే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. నవీన్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అటు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సీర్సపల్లిలో ఓ ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానిక వినాయక మండపం వద్ద విద్యుత్ బల్బులు సరి చేస్తూ యశ్వంత్ అనే యువకుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Also Read: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భద్రతా వైఫల్యం - మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని, బీసీసీఐ ఆగ్రహం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.