అన్వేషించండి

Year Ender 2022 : ఎమ్మెల్సీ డ్రైవర్ మృతదేహం డోర్ డెలివరీ టు ప్రేమోన్మాది హత్యలు ! ఏపీలో 2022లో సంచలనం సృష్టించిన నేరాలు - ఘోరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా కూడా జరుగుతాయా అన్న నేరాలు.. ఘోరాలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. వాటిలో సంచలనం సృష్టించిననేరాలను ఇప్పుడు ఓ సారిగుర్తు చేసుకుందాం

 

Year Ender 2022 : crime news in andhra pradesh 2022 :   ఆంధ్రప్రదేశ్‌లో  ఎవరూ ఊహించని నేరాలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. అందులో స్వయంగా ఓ ఎమ్మెల్సీ.. తన మాజీ డ్రైవర్ నుంచి చంపేసిన డోర్ డెలివరీ చేయడం దగ్గర్నుంచి..   ప్రేమోన్మాది హత్యల వరకూ ఉన్నాయి. 

 
ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తెచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అనంతరం అనంతబాబు పరారీలో ఉన్నాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరవుతూ ఏం జరగనట్లే వ్యవహరించారు. అయితే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టుచేశారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. మే 19న ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని అప్పట్లో పోలీసులు తెలిపారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఇగో హర్ట్ అయ్యి నెట్టడంతో డ్రైవర్ చనిపోయాడని ఎస్పీ ఇచ్చిన వివరణపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 


హిందూపురం వైసీపీ నేత దారుణహత్య 

హిందూపురం నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.  రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు.  దాబా మూసేసి కారులో ఇంటికి  వచ్చే సమయానికి మాట వేసిన  దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. మొత్తం 18 చోట్ల విచక్షణ రహితంగా నరికి పరారయ్యారు. పార్టీలో ఆధిపత్యం కారణంగా సొంత పార్టీ నేతలే హత్య చేసినట్లుగా తేలింది. 
 

నంద్యాలలో కానిస్టేబుల్ హత్య 

ఏపీలో సంచలనం మరో నేరం నంద్యాల కానిస్టేబుల్ హత్య.  నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసి హతమార్చిన ఘటన ప్రజల్ని భయకంపితుల్ని చేసింది.  నంద్యాల డిఎస్పీ ఆఫీసులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గూడూరు సురేంద్రనాథ్‌ను ఆగష్టు 7వ తేది రాత్రి సుమారు 9గంటల సమయంలో నడిరోడ్డుపై హత మార్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గెలివి స్కూల్ ప్రక్కన ఉన్న మిరాకిల్ టాటూ షాప్ ప్రక్కనే ఉన్న నాగేంద్ర బైక్ షీట్ కవర్ షాపు దగ్గర 9 మంది నిందితులు కానిస్టేబుల్ గూడూరు సురేంద్రనాథ్‌తో గొడవ పెట్టుకున్నారు. కానిస్టేబుల్‌ మీద దాడిచేసి తీవ్రంగా గాయపరిచి, తిరుమల ఫర్నిచర్ షాపు దగ్గర దారిలో పోయే ఆటొను ఆపి ఆటొ డ్రైవరును బెదరించి ఆటొలో సురేంద్రనాథ్‌ను బలవంతంగా ఎక్కించుకున్నారు. ఆటొలో కత్తులతో పొడిచి, కొట్టుకుంటూ తీసుకెళ్లి హింసించారు. మహానంది రోడ్డులో ఉన్న చెరువు కట్ట మీద పిడి బాకులతో విచక్షణ రహితంగా పొడిచి చంపేశారు. 
 
గుంటూరులో దంత విద్యార్థిని హత్య  చేసిన ప్రేమోన్మాది !

పెళ్లికి నిరాకరించిందని గుంటూరులో ఓ ప్రేమోన్మాది  దంత వైద్యవిద్యార్థి తపస్విని దారుణంగా హత్య చేశాడు.   కృష్ణాజిల్లాకు ఉయ్యూరుకు తపస్వి, ఉంగుటూరు మండలం మణికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా చిగురించింది. పెళ్లి చేసుకోవాలని జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేయడంతో తపస్వి నిరాకరించింది. దీంతో ఉద్యోగం మానేసి జ్ఞానేశ్వర్ ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్దకాకాని సమీపంలోని తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికెళ్లిన తపస్విని వెంబడించిన జ్ఞానేశ్వర్‌ మరోసారి పెళ్లి విషయమై ప్రస్తావించాడు. తపస్వి నిరాకరించడంతో ముందుగానే తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో తపస్విపై దాడికి పాల్పడ్డాడు. గొంతు భాగానికి తీవ్రమైన గాయం తగలడంతో తపస్వి మరణించింది.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 


పెళ్లి చేసుకోనందని తుపాకీతో కాల్చి.. తాను కాల్చుకున్నాడు ! 
 
నెల్లూరు జిల్లా తాటిపర్తి అనే చిన్న గ్రామంవో కావ్య అనే యువతిని  సురేశ్‌ రెడ్డి  తుపాకీతో కాల్చి చంపేశాడు.  తాటిపర్తి గ్రామంలో పక్క పక్క వీధుల్లోనే వీరి ఇళ్లున్నాయి.  ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. రు. మరదలి వరస అయ్యే కావ్యను పెళ్లి చేసుకుంటానని, సంబంధం మాట్లాడాలని సురేశ్‌ రెడ్డి ఏడాది కిందటే తన తల్లిదండ్రులను కోరాడు. ఆయన కుటుంబ సభ్యులు కావ్య తల్లిదండ్రులను  కలిసి... సంబంధం కలుపుకొందామని అడిగారు. కానీ... ఈ పెళ్లికి కావ్య ఇష్టపడలేదు. కావ్యను పెళ్లి చేసుకోవాలన్న కోరిక నెరవేరకపోవడంతో సురేశ్‌ రెడ్డి రగిలిపోయాడు. ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.  ‘మేడిన్‌ అమెరికా’ పిస్టల్‌ సంపాదించాడు. సరైన సమయం చూసుకుని పాయింట్ బ్లాంక్ లో కావ్యను కాల్చి చంపాడు. తర్వాత సురేష్ రెడ్డి కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. 
  

కర్నూలులో కోడళ్లను చంపేసిన మామ, భర్తలు

కర్నూలు  ఓర్వకల్లు నన్నూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కోడళ్లను మూఢనమ్మకాలతో తండ్రితో కలిసి భర్తలు చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది.  గోవన్న అనే వ్యక్తికి  గ్రామంలో 40 ఎకరాల వరకు భూమి ఉంది. ఇద్దరు కొడుకులు, వారికి పెళ్లిల్లు అయ్యాయి.  గోవన్న అనారోగ్యం చేయడంతో నాటు వైద్యుడు వద్దకు వెళ్లారు. కోడళ్లు మందు పెట్టారని చెప్పడంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేశాడు. పిల్లలు పుట్టడం లేదు కాబట్టి వారికి మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పి కొడుకుల్ని ఒప్పించి కోడళ్లను చంపేశారు.   


విశాఖలో భయం పుట్టించిన సైకో కిల్లర్ అరెస్ట్ 

వవిశాఖలో  మహిళలను చంపేసి… వారి ప్రైవేటు భాగాలను చూస్తూ ఎంజాయ్ చేసే సైకోను పోలీసులు ఈ ఏడాదే పట్టుకున్నారు. ఓ హత్య కేసులో రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తే సంచలన విషయాలు వెలుగు చూశాయి.    తనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లిపోవడంతో పాటు  ఇంటి యజమానురాలు కూడా తనను మోసం చేయడంతో ... ఆడవాళ్ళ మీద పగ పెంచుకున్న రాంబాబు  ఆడజాతి మొత్తాన్ని నాశనం చేయాలని హత్యలు ప్రారంభించాడు.  వాచ్ మెన్ భార్యలైతే ఈజీగా పని అయిపోతుందని భావించి మొట్టమొదటిసారి వాచ్ మెన్ దంపతులను హత్య చేశాడు.  చనిపోయింది ఆడ, మగ అని తెలుసుకునేందుకు, ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని చూసి నిర్ధారించుకునే వాడంట. రాంబాబును పట్టుకోవడంతో ఓ సైకో కటకటాల వెనక్కి వెళ్లాడు. 
 
ఆలయంలోనే పూజారి హత్య 

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో  శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) ను గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం లోపలే హత్య చేశారు. తలపగులగొట్టి ఆయన్ను దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు చంపాలో తెలియదు. గుళ్లోనే చంపడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలంరేగింది. 
  

ఏపీలో అత్యధికంగా హత్యలే కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన నేరాల్లో హత్యలే ఎక్కువగా ఉంటున్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
Embed widget