అన్వేషించండి

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లా, రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. చేపల చెరువు వద్ద విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే వివిధ వేదికలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వైసీపీ లీడర్ అలాంటి ఆరోపణలతోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన ఓ ఎంపీటీసీ కావడం ఇక్కడ మరో ట్విస్ట్. 

పార్టీ కోసం కట్టుబడి పని చేస్తున్న వారిపైనే నాయకులు ఇలా వేధింపులకు దిగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాయని ఓ సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయాడా వైసీపీ ఎంపీటీసీ. తన చేపల చెరువులను పట్టించి వేధిస్తున్నారని తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతినడంతో తట్టుకోలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గ్రామీణ మండలం గుడివాకులంక గ్రామంలో జరిగింది. ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు చేపల చెరువు వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుని అందులో తనను వేధించే వాళ్ల పేర్లు చెప్పారు.  

వాళ్లంతా కావాలనే కుట్ర పన్నారు..

చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బాలరాజుకు మద్దతు ఇవ్వడం, రామారావుకు తాను సపోర్టు చేయకపోవడం వల్ల తనపై కక్ష పెంచుకున్నారని ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు తెలిపారు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని సాల్మన్ వెల్లడించారు. ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేయకపోవడంతో కోపం, పగ పెంచుకుని తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా అవమానపరిచారని, తన చెరువులను పట్టించారని సాల్మన్ రాజు తెలిపారు. శారీరకంగా, మానసికంగా తనను వేధించారని సాల్మన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తనను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు సాల్మన్‌. తనను వేధింపులకు గురి చేసిన వారిలో ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి అని, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వర రావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ తనను ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు. వీరిని వెనక ఉండి ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు అని తెలిపారు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు. తనను ఎలా వేధించాలో మార్గనిర్దేశం చేసింది, వారు సలహాలు, సూచనలు చేసింది ఘంటసాల రంగబాబు అని వివరించారు. తన చావుకు ఘంటసాల రంగబాబే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. 

వీడియోలోని పూర్తి మాటలు..

"బలే ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వరరావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ నా చెరువులు పట్టించేశారు. దీని వెనక ఉండి నడిపించింది, ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు. రాజేష్ వాళ్ల మామ. వారందరినీ పిలిచి మీటింగులు పెట్టించారు. అన్ని రకాలుగా వారిని నడిపించారు. ఘంటసాల రంగబాబు ప్రోత్సాహంతో వారు నా మీద బాగా రుబాబు చేశారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బలే బాలరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల, రామారావుకు సపోర్ట్ చేయకపోవడం వల్లే నన్ను వేధిస్తున్నారు. నా వాటాలు అమ్మకుండా చేశారు. డబ్బులు కట్టాలంటూ వేధించారు. కొత్త వాటాల్లో చిన్న పిల్లలకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపేశారు. వీరి వల్ల గుడివాకులంక గ్రామంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయపరంగా, పోలీసుశాఖ పరంగా గుడివాకులంకలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై దృష్టి పెట్టాలి. మా ఊరిలో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల భార్యలను వేధిస్తున్నారు. వారికి జీవనాధారమైన వాటాలను అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడివాకులంక గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసు శాఖ దృష్టి సారించాలి. అన్యాయాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. నేను చనిపోవడం వల్ల, నేను చెబుతున్న మాటల వల్ల గుడివాకులంక గ్రామస్థులకు న్యాయం జరుగుతుందని, వాస్తవాలు బయటపడతాయని వాటి ద్వారా గ్రామంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."  అని చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు వీడియో ద్వారా చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget