అన్వేషించండి

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లా, రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. చేపల చెరువు వద్ద విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే వివిధ వేదికలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వైసీపీ లీడర్ అలాంటి ఆరోపణలతోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన ఓ ఎంపీటీసీ కావడం ఇక్కడ మరో ట్విస్ట్. 

పార్టీ కోసం కట్టుబడి పని చేస్తున్న వారిపైనే నాయకులు ఇలా వేధింపులకు దిగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాయని ఓ సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయాడా వైసీపీ ఎంపీటీసీ. తన చేపల చెరువులను పట్టించి వేధిస్తున్నారని తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతినడంతో తట్టుకోలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గ్రామీణ మండలం గుడివాకులంక గ్రామంలో జరిగింది. ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు చేపల చెరువు వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుని అందులో తనను వేధించే వాళ్ల పేర్లు చెప్పారు.  

వాళ్లంతా కావాలనే కుట్ర పన్నారు..

చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బాలరాజుకు మద్దతు ఇవ్వడం, రామారావుకు తాను సపోర్టు చేయకపోవడం వల్ల తనపై కక్ష పెంచుకున్నారని ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు తెలిపారు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని సాల్మన్ వెల్లడించారు. ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేయకపోవడంతో కోపం, పగ పెంచుకుని తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా అవమానపరిచారని, తన చెరువులను పట్టించారని సాల్మన్ రాజు తెలిపారు. శారీరకంగా, మానసికంగా తనను వేధించారని సాల్మన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తనను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు సాల్మన్‌. తనను వేధింపులకు గురి చేసిన వారిలో ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి అని, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వర రావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ తనను ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు. వీరిని వెనక ఉండి ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు అని తెలిపారు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు. తనను ఎలా వేధించాలో మార్గనిర్దేశం చేసింది, వారు సలహాలు, సూచనలు చేసింది ఘంటసాల రంగబాబు అని వివరించారు. తన చావుకు ఘంటసాల రంగబాబే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. 

వీడియోలోని పూర్తి మాటలు..

"బలే ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వరరావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ నా చెరువులు పట్టించేశారు. దీని వెనక ఉండి నడిపించింది, ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు. రాజేష్ వాళ్ల మామ. వారందరినీ పిలిచి మీటింగులు పెట్టించారు. అన్ని రకాలుగా వారిని నడిపించారు. ఘంటసాల రంగబాబు ప్రోత్సాహంతో వారు నా మీద బాగా రుబాబు చేశారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బలే బాలరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల, రామారావుకు సపోర్ట్ చేయకపోవడం వల్లే నన్ను వేధిస్తున్నారు. నా వాటాలు అమ్మకుండా చేశారు. డబ్బులు కట్టాలంటూ వేధించారు. కొత్త వాటాల్లో చిన్న పిల్లలకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపేశారు. వీరి వల్ల గుడివాకులంక గ్రామంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయపరంగా, పోలీసుశాఖ పరంగా గుడివాకులంకలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై దృష్టి పెట్టాలి. మా ఊరిలో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల భార్యలను వేధిస్తున్నారు. వారికి జీవనాధారమైన వాటాలను అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడివాకులంక గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసు శాఖ దృష్టి సారించాలి. అన్యాయాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. నేను చనిపోవడం వల్ల, నేను చెబుతున్న మాటల వల్ల గుడివాకులంక గ్రామస్థులకు న్యాయం జరుగుతుందని, వాస్తవాలు బయటపడతాయని వాటి ద్వారా గ్రామంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."  అని చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు వీడియో ద్వారా చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget