అన్వేషించండి

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లా, రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. చేపల చెరువు వద్ద విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే వివిధ వేదికలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వైసీపీ లీడర్ అలాంటి ఆరోపణలతోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన ఓ ఎంపీటీసీ కావడం ఇక్కడ మరో ట్విస్ట్. 

పార్టీ కోసం కట్టుబడి పని చేస్తున్న వారిపైనే నాయకులు ఇలా వేధింపులకు దిగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాయని ఓ సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయాడా వైసీపీ ఎంపీటీసీ. తన చేపల చెరువులను పట్టించి వేధిస్తున్నారని తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతినడంతో తట్టుకోలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గ్రామీణ మండలం గుడివాకులంక గ్రామంలో జరిగింది. ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు చేపల చెరువు వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుని అందులో తనను వేధించే వాళ్ల పేర్లు చెప్పారు.  

వాళ్లంతా కావాలనే కుట్ర పన్నారు..

చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బాలరాజుకు మద్దతు ఇవ్వడం, రామారావుకు తాను సపోర్టు చేయకపోవడం వల్ల తనపై కక్ష పెంచుకున్నారని ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు తెలిపారు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని సాల్మన్ వెల్లడించారు. ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేయకపోవడంతో కోపం, పగ పెంచుకుని తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా అవమానపరిచారని, తన చెరువులను పట్టించారని సాల్మన్ రాజు తెలిపారు. శారీరకంగా, మానసికంగా తనను వేధించారని సాల్మన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తనను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు సాల్మన్‌. తనను వేధింపులకు గురి చేసిన వారిలో ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి అని, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వర రావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ తనను ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు. వీరిని వెనక ఉండి ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు అని తెలిపారు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు. తనను ఎలా వేధించాలో మార్గనిర్దేశం చేసింది, వారు సలహాలు, సూచనలు చేసింది ఘంటసాల రంగబాబు అని వివరించారు. తన చావుకు ఘంటసాల రంగబాబే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. 

వీడియోలోని పూర్తి మాటలు..

"బలే ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వరరావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ నా చెరువులు పట్టించేశారు. దీని వెనక ఉండి నడిపించింది, ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు. రాజేష్ వాళ్ల మామ. వారందరినీ పిలిచి మీటింగులు పెట్టించారు. అన్ని రకాలుగా వారిని నడిపించారు. ఘంటసాల రంగబాబు ప్రోత్సాహంతో వారు నా మీద బాగా రుబాబు చేశారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బలే బాలరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల, రామారావుకు సపోర్ట్ చేయకపోవడం వల్లే నన్ను వేధిస్తున్నారు. నా వాటాలు అమ్మకుండా చేశారు. డబ్బులు కట్టాలంటూ వేధించారు. కొత్త వాటాల్లో చిన్న పిల్లలకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపేశారు. వీరి వల్ల గుడివాకులంక గ్రామంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయపరంగా, పోలీసుశాఖ పరంగా గుడివాకులంకలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై దృష్టి పెట్టాలి. మా ఊరిలో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల భార్యలను వేధిస్తున్నారు. వారికి జీవనాధారమైన వాటాలను అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడివాకులంక గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసు శాఖ దృష్టి సారించాలి. అన్యాయాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. నేను చనిపోవడం వల్ల, నేను చెబుతున్న మాటల వల్ల గుడివాకులంక గ్రామస్థులకు న్యాయం జరుగుతుందని, వాస్తవాలు బయటపడతాయని వాటి ద్వారా గ్రామంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."  అని చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు వీడియో ద్వారా చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
UP Man Killed By Lover: ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !
ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget