అన్వేషించండి

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లా, రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. చేపల చెరువు వద్ద విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే వివిధ వేదికలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వైసీపీ లీడర్ అలాంటి ఆరోపణలతోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన ఓ ఎంపీటీసీ కావడం ఇక్కడ మరో ట్విస్ట్. 

పార్టీ కోసం కట్టుబడి పని చేస్తున్న వారిపైనే నాయకులు ఇలా వేధింపులకు దిగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాయని ఓ సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయాడా వైసీపీ ఎంపీటీసీ. తన చేపల చెరువులను పట్టించి వేధిస్తున్నారని తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతినడంతో తట్టుకోలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గ్రామీణ మండలం గుడివాకులంక గ్రామంలో జరిగింది. ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు చేపల చెరువు వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుని అందులో తనను వేధించే వాళ్ల పేర్లు చెప్పారు.  

వాళ్లంతా కావాలనే కుట్ర పన్నారు..

చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బాలరాజుకు మద్దతు ఇవ్వడం, రామారావుకు తాను సపోర్టు చేయకపోవడం వల్ల తనపై కక్ష పెంచుకున్నారని ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు తెలిపారు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని సాల్మన్ వెల్లడించారు. ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేయకపోవడంతో కోపం, పగ పెంచుకుని తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా అవమానపరిచారని, తన చెరువులను పట్టించారని సాల్మన్ రాజు తెలిపారు. శారీరకంగా, మానసికంగా తనను వేధించారని సాల్మన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తనను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు సాల్మన్‌. తనను వేధింపులకు గురి చేసిన వారిలో ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి అని, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వర రావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ తనను ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు. వీరిని వెనక ఉండి ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు అని తెలిపారు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు. తనను ఎలా వేధించాలో మార్గనిర్దేశం చేసింది, వారు సలహాలు, సూచనలు చేసింది ఘంటసాల రంగబాబు అని వివరించారు. తన చావుకు ఘంటసాల రంగబాబే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. 

వీడియోలోని పూర్తి మాటలు..

"బలే ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వరరావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ నా చెరువులు పట్టించేశారు. దీని వెనక ఉండి నడిపించింది, ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు. రాజేష్ వాళ్ల మామ. వారందరినీ పిలిచి మీటింగులు పెట్టించారు. అన్ని రకాలుగా వారిని నడిపించారు. ఘంటసాల రంగబాబు ప్రోత్సాహంతో వారు నా మీద బాగా రుబాబు చేశారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బలే బాలరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల, రామారావుకు సపోర్ట్ చేయకపోవడం వల్లే నన్ను వేధిస్తున్నారు. నా వాటాలు అమ్మకుండా చేశారు. డబ్బులు కట్టాలంటూ వేధించారు. కొత్త వాటాల్లో చిన్న పిల్లలకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపేశారు. వీరి వల్ల గుడివాకులంక గ్రామంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయపరంగా, పోలీసుశాఖ పరంగా గుడివాకులంకలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై దృష్టి పెట్టాలి. మా ఊరిలో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల భార్యలను వేధిస్తున్నారు. వారికి జీవనాధారమైన వాటాలను అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడివాకులంక గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసు శాఖ దృష్టి సారించాలి. అన్యాయాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. నేను చనిపోవడం వల్ల, నేను చెబుతున్న మాటల వల్ల గుడివాకులంక గ్రామస్థులకు న్యాయం జరుగుతుందని, వాస్తవాలు బయటపడతాయని వాటి ద్వారా గ్రామంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."  అని చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు వీడియో ద్వారా చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
KTR News: HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Best Car In The World: 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ దీనిదే, ఈ కార్‌ని మన దేశంలో కొనొచ్చా?
'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ దీనిదే, ఈ కార్‌ని మన దేశంలో కొనొచ్చా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
KTR News: HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Best Car In The World: 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ దీనిదే, ఈ కార్‌ని మన దేశంలో కొనొచ్చా?
'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ దీనిదే, ఈ కార్‌ని మన దేశంలో కొనొచ్చా?
Hyderabad Metro Train: పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Embed widget