అన్వేషించండి

Warangal Crime : కొబ్బరి బొండాల మాటున గంజాయి రవాణా, ఉప సర్పంచ్ సహా నలుగురు అరెస్ట్!

Warangal Crime : ఏపీ నుంచి వరంగల్ కు గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కొబ్బరి బొండాల మాటున గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Warangal Crime : కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఉప సర్పంచ్ సహా నలుగురిని  టాస్క్ ఫోర్స్,  ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 లక్షల రూపాయల విలువైన 170 కిలోల గంజాయి, ఒక కారు, గంజాయి రవాణాకు వినియోగించిన బోలెరో వాహనం, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో  రాయినేని శంకర్, ముసిక లక్ష్మణ్, మాట మహేష్, గండికోట సతీష్ ఉన్నారు.

అసలేం జరిగింది? 

ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ పి.కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ... నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగం నిందితులు మిగితా ఇద్దరు నిందితులతో కలిసి ఏపీలోని నర్సీపట్నంలోని నూకరాజు ద్వారా 170 కిలోల గంజాయిని కోనుగోలు చేసి దానిని రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపర్చి వరంగల్ కు తరలించారు. ఈ గంజాయిని వరంగల్ తరలించే క్రమంలో ప్రధాన నిందితులు శంకర్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరో కారులో గంజాయికి తరలిస్తున్న కారుకు ఎస్కాట్ గా వ్యవహరించేవారు. పోలీసులకు అందిన సమాచారంతో టాస్క్ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు.. ఆత్మకూర్ గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహించిన తనీఖీల్లో అనుమానస్పదంగా వస్తున్న నిందితులు వాహనాలను అదుపులోకి తీసుకోని తనిఖీ చేశారు. బోలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Warangal Crime : కొబ్బరి బొండాల మాటున గంజాయి రవాణా, ఉప సర్పంచ్ సహా నలుగురు అరెస్ట్!

వైజాగ్ టూ బెంగుళూరు గంజాయి అక్రమ రవాణా 

చిత్తూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీతో  గంజాయి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నా  స్మగ్లర్లు పోలీసుల కన్ను కప్పి గంజాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. తాజాగా వైజాగ్ నుంచి బెంగుళూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని పది లక్షల రూపాయలు విలువ చేసే 96 కేజీల గంజాయిని, ఒక కారుని సీజ్ చేశారు. 

పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి. పలమనేరు పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం‌తో‌ బంగారుపాళ్యం ‌మండలం, ఎన్ హెచ్-69 జాతీయ రహదారిలోని మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు చేపట్టగా, పోలీసులను చూసి ఓ కారు వస్తున్న కొందరు పరార్ అయ్యేందుకు ప్రయత్నం చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు  ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, నర్సీపట్నం నుంచి బెంగుళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయలు విలువ చేసే 96 కేజీల గంజాయిని, ఒక హొండా‌సిటి కారును సీజ్ చేశారు. నిందితులు కర్ణాటకకు చెందిన శంభూ అనే స్మగ్లర్, తమిళనాడుకు చెందిన రమేష్ అనే వ్యక్తిలు వైజాక్ సమీపంలోని నర్సీపట్నం నుంచి గంజాయిని విక్రయించి కర్ణాటకకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. అంతే కాకుండా పట్టుబడిన అబ్దుల్ జలీల్, మురళీధరన్, అభిలాష్ లు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రధాన ముద్దాయిలు శంభు, రమేష్ ల‌ కోసం గాలిస్తున్నామని, శంభు, రమేష్ లను పట్టుకుని గంజాయిని నర్సీపట్నంలో ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారే విషయం తెలుస్తుందన్నారు. గతంలోనే శంభు, రమేష్‌లపై తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీసు స్టేషన్ లల్లో‌ కేసు నమోదు అయినట్లు తెలిసిందని పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలియజేశారు. 

Warangal Crime : కొబ్బరి బొండాల మాటున గంజాయి రవాణా, ఉప సర్పంచ్ సహా నలుగురు అరెస్ట్!

 

 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget