అన్వేషించండి

Vizianagaram Crime News:ఏపీ సచివాలయంలో ఉద్యోగాలు- ఫేస్‌బుక్‌లో ప్రకటన- హైదరాబాద్‌ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్‌!

Vizianagaram Crime News:సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టు నమ్మితే ఎలాంటి విపరిణామాలు జరుగుతోయో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్. సచివాలయ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాన్ని పోలీసులు ఛేదించారు.

Vizianagaram Crime News: కార్పొరేట్ కంపెనీలో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది, ఆసక్తి ఉన్న వాళ్లు మెసేజ్ పెట్టండి అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చూస్తున్నాం. ఈ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమిస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు నన్ను సంప్రదించండి. అని ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టాడు. అది నమ్మిన కొందరు యువకులు అతనికి వ్యక్తిగతంగా సంప్రదించారు. అదే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. 

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అవుట్‌ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు  ఉన్నాయని విజయనగరానికి చెందిన కె.సాయి వెంకట్ సుజిత్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు.అది వైరల్ అయింది. దాన్ని నమ్మిన ఉత్తరాంధ్రకు చెందిన కొందరు యువకులు సుజిత్‌ను సంప్రదించారు. వారి మధ్య చాలా రకాల చర్చలు జరిగాయి. 

చాలా మంది ఇలా సంప్రదించినప్పటికీ కొందరు మధ్యలోనే డ్రాప్ అయ్యారు. మరికొందరు చివరి వరకు వచ్చారు. అలా వచ్చిన వారు ఏడుగురు. అతనితో ఉద్యోగాల కోసం మాట్లాడుకున్నారు. ఉద్యోగం అవుట్‌ సోర్సింగ్ అయినా చాలా మందికి చేతులు తడపాల్సి ఉంటుందని వారికి కలరింగ్ ఇచ్చాడు సుజిత్. మాటకారి అయిన సుజిత్ వారిన బోల్తాకొట్టించాడు. వారి వద్ద నుంచి 53 లక్షలు రూపాయలు తీసుకున్నాడు. 

డబ్బులు తీసుకున్న సుజిత్‌ కొన్ని రోజుల తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు పంపించాడు. అవి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అని తెలియక వారు నిజంగానే ఉద్యోగాలు వచ్చాయని సంబరపడిపోయారు. అంతేకాదు వారిని విజయవాడకు తీసుకొచ్చి ట్రైనింగ్ ఉంటుందని కూడా చెప్పాడు. వారిని నెలరోజుల పాటు ఓ ప్రాంతంలో ఉంచాడు. రోజులు గడిచాయి.  ట్రైనింగ్ స్టార్ట్ కాకపోవడం, సచివాలయానికి తీసుకెళ్లకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. నిలదీశారు. 

టెక్నికల్ సమస్య ఉందని ఇంటికి వెళ్లిపోమని చెప్పాడు సుజిత్. వారం పదిరోజుల్లో మళ్లీ కబురు పెడతామని కలరింగ్ ఇచ్చాడు. ఇంటికి వచ్చి చాలా కాలమైనా సుజిత్ నుంచి కబురూ లేదూ కాకరకాయా లేదు. దీంతో వారి అనుమానం మరింత ఎక్కువైంది. బాధితుల్లో ఒకరైన ఎస్.కోటకు చెందిన ఎస్.వినోద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అసల విషయం చెప్పాడు. తనకు వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్‌ను కూడా చూపించాడు. 

అపాయింట్మెంట్ ఆర్డర్‌ను చూసిన పోలీసులు అది నకిలీదని తేల్చారు. వాళ్లంతా మోసపోయినట్టు చెప్పారు.వ వెంటనే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేపట్టారు. కేసు గురించి తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. ముఠాగా ఏర్పడి వీళ్లు ఈ దందా చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వారి వివరాలు కూడా తెలుసుకున్నారు. 

ఈ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుజిత్‌ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. మిత్రుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడాన్ని తెలుసుకున్న మిగతా నిందితులు పరామర్శించేందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు విజయనగరం రైల్వేస్టేషన్ సమీపంలో మాటు వేశారు. నిందితులు ట్రైన్ దిగ్గానే సీహెచ్ మహేష్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సుజిత్‌ను కోలుకోగానే అరెస్టు చేస్తామని చెప్పారు. 

ఇప్పుడు చిక్కిన నిందితుల్లో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా... మరో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌వాసులు. వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడి ఉద్యోగాలు, ఇతర దందాల పేరుతో అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు కూడా నిందితులు అంగీకరించారు. నమ్మిన డబ్బులు ఇచ్చే వారిని మోసం చేసి హైదరాబాద్‌లో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐడీ కార్డులు తయారు చేస్తున్నట్టు వెల్లడించారు.   

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget