By: ABP Desam | Updated at : 02 May 2022 05:27 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
విజయనగరంలో భర్తను హత్య చేయించిన భార్య
Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో భర్త మర్డర్ కు ప్లాన్ చేసిందో మహిళ. ప్రియుడితో వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయిందని హత్యకు పక్కా పథకం వేసింది. మరో ఇద్దరి సాయంతో భర్తను చితక్కొట్టి రైలు పట్టాలపై పడేసింది. రైలు పట్టాలపై మృతిదేహం లభించడంతో రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీసులకు కేసు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన రూరల్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. కట్టుకున్న భార్యే ఈ కేసులో నిందితురాలు అని గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ టీఎస్.మంగవేణి ఆదివారం వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
అద్దె ఇంటి యజమాని కొడుకుతో సంబంధం
విజయనగరం మిమ్స్ మెడికల్ కాలేజిలో క్లర్క్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ నెల్లిమర్ల డైట్ కాలేజి సమీపంలో నివాసం ఉంటున్నారు. గతంలో ఆయన నెల్లిమర్లలోని గొల్లవీధిలో కిలాని సూరి ఇంట్లో రెంట్ కు ఉండేవారు. అప్పుడు సూరి రెండో కుమారుడు రాంబాబుతో చంద్రశేఖర్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం చంద్రశేఖర్కు తెలిసి భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను పూర్తిగా అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు రాంబాబుతో కలిసి ఫ్లాన్ చేసింది. ప్రియుడి స్నేహితుడు ఎర్రంశెట్టి సతీష్కు రూ.40 వేలు సుపారీ ఇచ్చారు. భర్తను హతమార్చేందుకు తన తల్లి సత్యవతిని డబ్బులు అడిగింది మృతుడి భార్య జ్యోతి. ఆమె రూ.20వేలు ఇచ్చింది.
మద్యం తాగించి ఆపై హత్య
పథకం ప్రకారం ఏప్రిల్ 24వ తేదీ రాత్రి డైట్ కాలేజి దగ్గర జ్యోతి ప్రియుడు రాంబాబు, సతీష్లు చంద్రశేఖర్కు ఫూటుగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్ పై ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టి కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి పరారయ్యారు. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతుడి భార్య అరుణ జ్యోతి, ఆమె తల్లి సత్యవతి, ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్లను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం