అన్వేషించండి

Vizianagaram Crime Report: విజయనగరంలో గంజాయి కల్చర్‌, వివాహేతర సంబంధాలతో హత్యలు - క్రైమ్ రిపోర్ట్ @2022

విజయనగరంలోనూ నేరాలు పెరిగిపోతున్నాయి. గంజాయి అక్రమ రవాణదారులపై 2021లో 32 కేసులు నమోదుకాగా.. 2022లో 50 కేసులు నమోదు చేసి, 89మందిని అరెస్టు చేశారు.

ప్రశాంతతకు మారుపేరైన విజయనగరంలోనూ నేరాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని ‘మత్తు’ కల్చర్‌ పెరుగుతోంది. గంజాయి రవాణాతోపాటు, వినియోగమూ అధికమవ్వడం.. ఇందులో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. 2022లో 50 గంజాయి రవాణా కేసులు నమోదై.. ఏకంగా 89 మంది అరెస్టయ్యారు. దీంతోపాటు సైబర్‌ నేరాలు, హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయి. 2022 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో నేరాల తీరుపై ఎస్పీ ఎం.దీపిక వార్షిక నివేదికను వెల్లడిరచారు. గంజాయి అక్రమ రవాణదారులపై 2021లో 32 కేసులు నమోదుకాగా.. 2022లో 50 కేసులు నమోదు చేసి, 89మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3,180.855 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

గంజాయి వినియోగిస్తున్న వారిపైనా 24 కేసులు నమోదు చేశారు. మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి 2021లో అత్యాచారం కేసులు 76 నమోదుకాగా, 2022లో ఈ తరహా నేరాలు 34 శాతం తగ్గి, 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులు 2021లో 218 నమోదుకాగా, 2022లో 19శాతం తగ్గి, 176 కేసులు నమోదయ్యాయి. 2021లో పోక్సో కేసులు 71 నమోదు కాగా, 2022లో వాటి సంఖ్య 38శాతం తగ్గి, 44 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 

హత్యల్లో ఎలా ఉందంటే..
2021లో 24 హత్యలు జరగా, 2022లో 23 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యల్లో చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం కావడం గమనార్హం. 2021లో లాభాపేక్ష హత్యలు 3 నమోదు కాగా, 2022లో ఎటువంటి కేసూ నమోదు కాలేదు. 2021లో దోపిడీ కేసులు 10 నమోదు కాగా, 2022లో 4 దోపిడీ (రోబరీ) కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసులు 2021లో 35 కేసులు ఉండగా.. 2022లో 12 హత్యాయత్నం కేసులే ఉన్నాయి. 2021లో 69మంది పిల్లలు తప్పిపోగా, 2022లో 82మంది తప్పిపోయారు. వంద శాతం వారిని కనుగొని తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించారు. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 2022లో 1,64,35,352/-ల విలువైన ఆస్తులు చోరీకి గురి కాగా, వాటిలో 85శాతం రికవరీతో రూ.1,39,02,852/- ల విలువైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 

గతం కంటే పెరిగిన సైబర్‌ నేరాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా మోసగాళ్లు కూడా తమ పంథాను మారుస్తున్నారు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణే జిల్లాలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు. సైబరు నేరాలకు సంబంధించి 2022లో 139 కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాది ఆ సంఖ్య 105గా ఉంది. సైబరు నేరాల నియంత్రణకు మహిళా పోలీసులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, డోర్‌ టూ డోర్‌ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నేరం జరిగిన తరువాత ఫిర్యాదు చేయడం పట్ల అవగాహన కల్పించడం వల్ల కేసుల నమోదు సంఖ్య గత ఏడాది కంటే పెరిగిందని ఆమె చెప్పారు. 

తగ్గిన రోడ్డు ప్రమాదాలు
2021లో రహదారి ప్రమాదాల్లో 222 కేసులు నమోదై, 238 మంది మృతి చెందారు. 2022లో పోలీసు శాఖ చేపట్టిన భద్రత చర్యల ఫలితంగా 10శాతం తగ్గి 216 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య తొమ్మిది శాతం తగ్గి, 216 మంది మృతి చెందారు. 2022లో డిస్పోజ్‌ అయిన కేసుల్లో 60శాతం నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 6,171 కేసులు 2022లో డిస్పోజ్‌ కాగా, వాటిలో 3,698 కేసుల్లో నిందితులను శిక్షించారు. జిల్లా వ్యాప్తంగా సారా ప్రభావిత 77 గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో పూర్తిగా సారాను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 79 కుటుంబాలను గుర్తించి, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు రూ.43.31 లక్షల ఆర్ధిక సహాయాన్ని 121 మందికి అందించారు. 

ముఖ్యమైన కేసుల ఛేదన ఇలా.. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో రవి జ్యూవలరీ షాపులో చోరీ జరిగింది. ఈ నేరాన్ని 24 గంటల వ్యవధిలో ఛేదించి 1.180 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. మరో కేసులో మోటారు సైకిలు డిక్కీ నుంచి దొంగిలించిన రూ.5.30 లక్షల నగదును 48 గంటల్లోనే ఛేదించారు. పూసపాటిరేగ పోలీసు స్టేషను పరిధిలో హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసి, నిందితులను అరెస్టు చేసి, హత్య మిస్టరీని ఛేదించామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Hyderabad Latest News: హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.