అన్వేషించండి

TS Crime : ఆదర్శ దంపతుల దొంగాట, చివరికి కటకటాల పాలు!

TS Crime : వేములవాడలో ఆదర్శదంపతులను పోలీసులు అరెస్టు చేశారు. భార్యభర్తలిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లు రెక్కీ చేసి ఈ దొంగ జంట దోచేస్తుంది.

TS Crime : భార్య అంటే భర్తలో సగం అంటారు. అలాగే భర్త చేసే పనుల్లో సగం బాధ్యత ఉంటుంది అని అంటారు. ఇది వాస్తవమని నిరూపించాలని అనుకుందో ఏమో ఓ మహిళ తన భర్తతో పాటు దొంగతనాల్లో పాలుపంచుకుంది. ఇంకేముంది ఆ మహిళ ఇచ్చిన సపోర్ట్ తో భర్త సైతం రెచ్చిపోయాడు. సొంత ఊర్లో అయితే అందరూ గుర్తుపడతారు అనుకున్నాడు ఏమో పక్కన ఉన్న రాష్ట్రాల్లో తన పనితనాన్ని చూపారు భార్యభర్తలు. పకడ్బందీగా రెక్కీ చేస్తూ ఇళ్లలో దొంగతనాలు చేసేవారు  ఆ ఇద్దరూ.  వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ దంపతులిద్దరూ కాలం గడిపారు. అయితే కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా!  చివరికి వేములవాడ పోలీసుల చేతికి చిక్కారు. ఇంతకీ ఆ దొంగ జంట కథేంటో మీరు చదవండి. 

దొంగ దంపతులు అరెస్ట్

వేములవాడ మండలంలో దొంగతనాలకు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి వారి నుంచి 37.8 తులాల బంగారం 32.5  వెండి, రూ.11,500 నగదును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలను తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రాంతానికి చెందిన మనోహర్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉండగా గత నెల 14న గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బు ఎత్తుకెళ్లారు. మనోహర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో  సీఐ వెంకటేష్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసు బృందానికి సెల్ టవర్ లోకేషన్ , ఇటీవల జరిగిన దొంగతనాల ఆధారంగా సూత్రధారులు ఎవరో తెలిసింది. దొంగతనానికి పాల్పడింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన దంపతులు తాళ్లపల్లి ధనలక్ష్మి, తాళ్లపల్లి ప్రసాద్ గా గుర్తించారు. వారిని బెల్లంపల్లిలోని బట్వానపల్లి గ్రామంలో ఇంటివద్ద పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ గత ఏడాది రుద్రవరంలో కూడా  దొంగతనానికి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. వాటిలో నుంచి సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

పక్క రాష్ట్రంలో కూడా 

పక్క రాష్ట్రాల్లో కూడా  వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలెవరూ ఇంట్లో అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు, డబ్బులు పెట్టుకోవద్దని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. దొంగ దంపతులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Also Read : Atmakur News : బాగా చదవడంలేదని రెచ్చిపోయిన స్కూల్ కరస్పాండెంట్, విద్యార్థులకు గాయాలు!

Also Read : Chittoor Crime : భర్త స్నేహితుడితో వివాహేత సంబంధం, ప్రియుడితో కలిసి మర్డర్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget