అన్వేషించండి

Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..

Hyderabad News: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అధిక లాభం ఆశ చూపి ఇద్దరి నుంచి రూ.2.42 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఓ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Cyber Crime In Hyderabad: స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులకు భారీ లాభాల పేరుతో ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.42 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఉన్నారు. ఈయన వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నేరగాళ్లకు డబ్బు పంపారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఫోన్ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు డిసెంబర్ చివరి వారంలో ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. స్టాక్ ట్రేడింగ్ చేస్తే బాగా డబ్బు సంపాదించొచ్చని.. తాము సలహాలు ఇస్తామని నమ్మబలికారు. ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో ఉన్న యాప్ డౌన్ లోడ్ చేశాడు. షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల తర్వాత మంచి ధర రాగానే విక్రయించాలని సూచించారు. అలా షేర్లు కొనుగోలు చేయించి డబ్బులు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు.

రుణం తీసుకుని మరీ..

అయితే, తొలిసారి షేర్లు కొన్నందుకు శాస్త్రవేత్తకు రూ.50 వేల లాభం వచ్చింది. దీంతో ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త భారీగా లాభాలు వస్తాయని డిసెంబర్ 24 నుంచి 18 రోజుల వ్యవధిలోనే 16 లావాదేవీల్లో 1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. ఈ క్రమంలో వ్యక్తిగత రుణం తీసుకుని మరీ డబ్బు సర్దుబాటు చేశాడు. పెట్టుబడి లాభంతో కలిపి మొత్తం రూ.3.26 కోట్లకు చేరగా.. నకిలీ యాప్‌లో వర్చువల్‌గా కనిపించినా విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వాట్సాప్ ద్వారా సంప్రదించగా ఇప్పుడే విత్‌డ్రా వద్దని.. లాభం ఇంకా రావాలంటే డబ్బులు ఇంకా పెట్టుబడి పెట్టాలని నేరగాళ్లు సూచించారు. దీంతో డబ్బు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తే.. అదనంగా రూ.కోటి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

రూ.10 వేలు ఆశ చూపి..

అలాగే, సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి ఓ ప్రైవేట్ ఉద్యోగి సైతం డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇంటి దగ్గరుండి పని చేస్తూ డబ్బు సంపాదించొచ్చని ఆశ పెట్టిన నేరగాళ్లు సదరు ఉద్యోగి నుంచి రూ.1.20 కోట్లు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో నివాసం ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి (31) వాట్సాప్‌నకు.. తాము ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తే రోజువారీగా డబ్బులు జమ చేస్తామని మెసేజ్ వచ్చింది. దీంతో ఆశపడ్డ అతను కొన్ని టాస్కులు పూర్తి చేయగా.. నేరగాళ్లు చెప్పినట్లుగానే పెట్టుబడి పెట్టాడు. తొలిసారి రూ.10,500 పెట్టగా.. లాభంతో కలిపి రూ.15,200 తిరిగి పంపారు. రెండోసారి బాధితుడు రూ.50 వేలు పంపగా.. తిరిగి రూ.65,100 వచ్చినట్లు ఓ వెబ్‌సైట్‌లో వర్చువల్‌గా చూపించారు.

లాభం రావడంతో డిసెంబర్ 6 నుంచి జనవరి 7వ తేదీ వరకూ దఫదఫాలుగా రూ.1.20 కోట్లు పంపించాడు. దీనికి రూ.14.83 లక్షలు లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించిన నేరగాళ్లు విత్ డ్రాకు అవకాశం ఇవ్వలేదు. అదనంగా డబ్బులు పంపించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget