అన్వేషించండి

Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..

Hyderabad News: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అధిక లాభం ఆశ చూపి ఇద్దరి నుంచి రూ.2.42 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఓ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Cyber Crime In Hyderabad: స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులకు భారీ లాభాల పేరుతో ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.42 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఉన్నారు. ఈయన వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నేరగాళ్లకు డబ్బు పంపారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఫోన్ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు డిసెంబర్ చివరి వారంలో ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. స్టాక్ ట్రేడింగ్ చేస్తే బాగా డబ్బు సంపాదించొచ్చని.. తాము సలహాలు ఇస్తామని నమ్మబలికారు. ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో ఉన్న యాప్ డౌన్ లోడ్ చేశాడు. షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల తర్వాత మంచి ధర రాగానే విక్రయించాలని సూచించారు. అలా షేర్లు కొనుగోలు చేయించి డబ్బులు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు.

రుణం తీసుకుని మరీ..

అయితే, తొలిసారి షేర్లు కొన్నందుకు శాస్త్రవేత్తకు రూ.50 వేల లాభం వచ్చింది. దీంతో ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త భారీగా లాభాలు వస్తాయని డిసెంబర్ 24 నుంచి 18 రోజుల వ్యవధిలోనే 16 లావాదేవీల్లో 1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. ఈ క్రమంలో వ్యక్తిగత రుణం తీసుకుని మరీ డబ్బు సర్దుబాటు చేశాడు. పెట్టుబడి లాభంతో కలిపి మొత్తం రూ.3.26 కోట్లకు చేరగా.. నకిలీ యాప్‌లో వర్చువల్‌గా కనిపించినా విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వాట్సాప్ ద్వారా సంప్రదించగా ఇప్పుడే విత్‌డ్రా వద్దని.. లాభం ఇంకా రావాలంటే డబ్బులు ఇంకా పెట్టుబడి పెట్టాలని నేరగాళ్లు సూచించారు. దీంతో డబ్బు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తే.. అదనంగా రూ.కోటి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

రూ.10 వేలు ఆశ చూపి..

అలాగే, సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి ఓ ప్రైవేట్ ఉద్యోగి సైతం డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇంటి దగ్గరుండి పని చేస్తూ డబ్బు సంపాదించొచ్చని ఆశ పెట్టిన నేరగాళ్లు సదరు ఉద్యోగి నుంచి రూ.1.20 కోట్లు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో నివాసం ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి (31) వాట్సాప్‌నకు.. తాము ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తే రోజువారీగా డబ్బులు జమ చేస్తామని మెసేజ్ వచ్చింది. దీంతో ఆశపడ్డ అతను కొన్ని టాస్కులు పూర్తి చేయగా.. నేరగాళ్లు చెప్పినట్లుగానే పెట్టుబడి పెట్టాడు. తొలిసారి రూ.10,500 పెట్టగా.. లాభంతో కలిపి రూ.15,200 తిరిగి పంపారు. రెండోసారి బాధితుడు రూ.50 వేలు పంపగా.. తిరిగి రూ.65,100 వచ్చినట్లు ఓ వెబ్‌సైట్‌లో వర్చువల్‌గా చూపించారు.

లాభం రావడంతో డిసెంబర్ 6 నుంచి జనవరి 7వ తేదీ వరకూ దఫదఫాలుగా రూ.1.20 కోట్లు పంపించాడు. దీనికి రూ.14.83 లక్షలు లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించిన నేరగాళ్లు విత్ డ్రాకు అవకాశం ఇవ్వలేదు. అదనంగా డబ్బులు పంపించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget