By: ABP Desam | Updated at : 22 Feb 2022 05:02 PM (IST)
ఇక కడప కోర్టులోనే విచారణ !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ( YS Vivekanamda Reddy ) ఇక నుంచి కడప కేంద్రంగా విచారణ జరగనుంది. హత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ అధికారుల ( CBI Officers ) అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు ( Pulivendula Court ) మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరగే విధంగా ఆదేశించారు. పులివెందుల కోర్టుకు మంగళవారం నలుగురు నిందితులు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ( Devireddy Siva Sankar Reddy ) మాత్రం హాజరు కాలేదు. వీరందరికీ సీబీఐ అభియోగ పత్రాల వివరాలను మెజిస్ట్రేట్ తెలియజేశారు.
ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి కొంత మంది పులివెందుల.. మరికొంత మంది కడప కేంద్రంగా విచారణ జరిపేవారు. పులివెందుల కోర్టు పరిధిలోకి వస్తూండటంతో అక్కడే విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు దస్తగిరి ( Dastagiri ) అప్రూవర్గా మారినందున కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఇలాంటి సమయంలో పులివెందులలో కన్నా కడప నుంచి విచారణ జరపడం మేలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ విజ్ఞప్తికి కోర్టు అంగీకరించడంతో ఇక నుంచి కడప కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగిస్తుంది.
వివేకా కేసులో సీబీఐ దూకుడుగా విచారణ జరుపుతోంది. దస్తగిరి అప్రూవర్గా మారడంతో ఆయనతో మరోసారి పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇప్పించారు. అప్రూవర్గా మారక ముందు ఇచ్చినస్టేట్ మెంట్ ఆధారంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని ( MP Avinash Reddy ) ప్రధాన నిందితునిగా అనుమానిస్తూ చార్జిషీట్ ( Chargesheet ) దాఖలు చేసింది. ఈ క్రమంలో దస్తగిరి రెండో సారి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ వాంగ్మూలం ఆధారంగా సీబీఐ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి ( YS Viveka ) మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు కావడంతో రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసుగా మారింది. ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా వైఎస్ కుటుంబీకులే కావడంతో వివాదం మరింత ముదురుతోంది. కేసు దర్యాప్తు కీలక దశలోకి రావడంతో ఎప్పుడు ఎలాంటి విషయాలు సంచనాలు వెలుగులోకి వస్తాయా అనిరాజకీయవర్గాలు కూడా ఉత్కంఠకు గురవుతున్నాయి.
Tirupati Accident : తిరుపతిలో ఘోర ప్రమాదం, ఫ్లై ఓవర్ పై నుంచి పడి ఇద్దరు విద్యార్థులు మృతి
Udaipur Murder : అమరావతిలో ఉదయ్పూర్ తరహా హత్య - రంగంలోకి ఎన్ఐఏ !
Cyber Crime : మీరు సైబర్ మోసానికి గురయ్యారా? టైం వేస్ట్ చేయకుండా ఇలా చేయండి?
Udaipur killer BJP member : టైలర్ లాల్ హత్య నిందితులు బీజేపీ వాళ్లా ? వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు !
Khammam Crime: డబుల్ బెడ్ రూమ్ పేరుతో కోటి రూపాయలు వసూలు- తెలిసిందెవరో తెలిస్తే షాక్
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
Jagan Daughter Harsha : కుమార్తె విజయంపై సంతోషం - ప్యారిస్ నుంచి సీఎం జగన్ ట్వీట్ వైరల్