By: ABP Desam | Updated at : 30 Nov 2022 02:08 PM (IST)
Edited By: jyothi
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కానిస్టేబుల్, చివరకు పోలీసులకు చిక్కి!
Tirupati News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజు రోజుకీ గంజాయి అక్రమ రవాణా పెరిగి పోతుంది. అడ్డ దారిలో సులభతరంగా డబ్బు సంపాదించేందుకు కొందరు గంజాయి స్మగ్లర్లు పోలీసులు సిబ్బందితో చేతులు కలిపి గంజాయి వ్యాపరాన్ని సాగిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా నుంచి చిత్తూరుకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ రేణిగుంటకు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్, అతని సమీప బంధువులను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి యాభై వేల రూపాయలు విలువ చేసే 3.6 కేజీల గంజాయిని, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే కారును చిత్తూరు టూ టౌన్ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.
కారును వెంబడించి మరీ పట్టుకున్న పోలీసులు..
చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు బృందాలుగా ఏర్పాటు చేసి, తరచూ పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిత్తూరు పట్టణ శివారు ప్రాంతంమైన కాణిపాకం క్రాస్ వద్ద చిత్తూరు టూ టౌన్ పోలీసులు తనిఖీ చేపడుతున్న సమయంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా వస్తున్న ఓ కారు ఆపకుండా పోలీసులు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టింది. అందలో ఉన్న 3.6 కేజీల గంజాయితోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూసింది.
సులభంగా డబ్బులు సంపాదించేందుకు అక్రమాలు..
గంజాయి అక్రమ రవాణాలో ప్రధాన ముద్దాయి చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన విజయ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతనితో పాటు అతని సమీప బంధువులు జననపల్లెకు చెందిన కిరణ్ కుమార్, మహేష్ కుమార్ పై కేసు నమోదు చేశారు. విజయ్ కుమార్ 2013 బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుల్గా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో కాణిపాకం పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే విజయ కుమార్, డిప్యుటేషన్ పై ప్రస్తుతం రేణిగుంట పొలీసు స్టేషన్ లో పని చేస్తున్నారు. అయితే సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఖాకీ చోక్కా మాటున గంజాయి అక్రమ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పైఅధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి..
తిరుపతి నుంచి చిత్తూరు జిల్లాల్లోని , తవణంపల్లె, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కాణిపాకం, పలమనేరు వంటి ప్రాంతాలకు కానిస్టేబుల్ విజయకుమార్ తన సమీప బంధువులైన మహేష్, కిరణ్ సహాయంతో గంజాయిని తరలించేవాడు. గతంలో తాను చిత్తూరు జిల్లాలో పని చేసిన పోలిసుల పరిచయాలతో గంజాయిని తరలించేవాడు. అయితే తనకు సహకరించిన వారికి కొంత నగదు, బహుమతులు ఇచ్చేవాడు. బెంగళూరు, తమిళనాడు నుంచి గంజాయిని తెప్పించుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాలో విక్రయించేవాడని పోలీసులు గుర్తించారు. అయితే గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసే గంజాయి అక్తమ రవాణా చేస్తుండడంపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
Hyderabad News: హైదరాబాద్లో ‘అత్తిలి సత్తి’ - విక్రమార్కుడు సీన్ రిపీట్!
Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
Hyderabad Crime News: పెళ్లై నలుగురు పిల్లలు, తొమ్మిదేళ్లు చిన్నోడైన వ్యక్తితో సహజీవనం - ఇంతలో ఇద్దరూ మృతి!
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !