By: ABP Desam | Updated at : 21 Mar 2023 11:38 AM (IST)
Edited By: jyothi
బాలికపై వాలంటీర్ అత్యాచారయత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
Tirupati Crime News: మహిళలపై రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. పసికందు నుంచి పండు ముసలి వాళ్ల వరకూ కామాంధులు తమ కోరికను తీర్చుకునేందుకు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. మహిళలపై, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. ఏదో ఒక మూల ఏదోక సందర్భంలో మానవ రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లో ఓ బాలిక తల్లి పిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి కథనం మేరకు.. నాగలాపురం మండలంలోని నందనం గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న మధురెడ్డి అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటి వద్ధకు వెళ్లాడు. అమ్మఒడి పథకం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కావాలని అడుగ్గా.. బాలిక ఇంటి లోపలి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ తేబోయింది. ఆమె లోపలికి వెళ్లగానే.. ఆమె వెంటే వెళ్లిన వాలంటీర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. వెంటనే వాలంటీర్ బయటకు పరుగులు తీశాడు. వెంటనే సదరు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే గ్రామ వాలంటీర్ పై వచ్చిన ఫిర్యాదు ఋజువు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారని ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. నిందితుడు మధురెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామన్నారు. మహిళలు, బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా సీఐ శివకుమార్ రెడ్డి హెచ్చరించారు.
కోనసీమ జిల్లాలో ఇటీవలే దారుణం.. బాలికతో ఫస్ట్ నైట్, వీడియోలు వైరల్
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండల పరిధిలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మైనర్ బాలికకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే తొలి రాత్రి గడుపుతుండగా అశ్లీల చిత్రాలను తీసి వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన భర్తను అరెస్ట్ చేసినట్లు కాట్రేనికోన ఎస్సై టి. శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామానికి చెందిన మైనర్ బాలికను మల్లాడి వీరబాబు ఈ ఏడాది ఫిబ్రవరి 8న వివాహం చేసుకున్నాడు.
కీచక భర్తకు 14 రోజులు రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
మొదటి రాత్రి ఆమెతో ఏకాంతంగా గడిపిన చిత్రాలను భర్త తన సెల్ ఫోన్ లో తీసుకున్నాడు. భర్త వాటిని వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపి ప్రచారం చేశాడు. ఇది కాస్తా బయట పడడంతో బాలిక కుటుంబానికి తెలిసింది. దాంతో అల్లుడి నిర్వాకంపై ఫిబ్రవరి 20న బాధితురాలి తల్లి కాట్రేనికోన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముమ్మిడివరం సీఐ ఎం.జానకిరామ్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 28న నిందితుడు మల్లాడి వీరబాబు అరెస్ట్ చేసి బుధవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !
Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!
Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?