అన్వేషించండి

Kasibugga Crime News: బర్త్‌డే పార్టీకి పిలిచి ఇద్దరు బాలికలపై యువకుల అత్యాచారం- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణం

Srikakulam Crime News: బర్త్ డే పార్టీకి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు యువకులు దుర్మార్గం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాశీబుగ్గలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో సంచలనం రేపుంతోంది.

Crime News: పలాస-కాశీబుగ్గలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపైముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్ డే పార్టీకి పిలిచి మైనర్‌పై యువకులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. పరువు పోతుందని భయపడి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదు. తర్వాత ధైర్యం తెచ్చుకుని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బర్త్‌డే పార్టీలో అఘాయిత్యం

కాశీబుగ్గకు చెందిన ముగ్గురు బాలికలు, నేతాజీనగర్, సూదికొండ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు ఫ్రెండ్స్‌. కోసంగిపురం జగనన్న కాలనీ వద్ద ఈ నెల 19న శనివారం రాత్రి పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. అక్కడ ఓ ఇంట్లో యువకులు మద్యం సేవించారు. తర్వాత ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడగా వేరొక బాలిక ప్రతిఘటించినట్లుగా తెలిసింది. 

ఫిర్యాదు చేయడానికి తటపటాయించీ...

అత్యాచారానికి పాల్పడుతుండగా యువకులు తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి ఇంటికి చేరుకున్న బాలికలు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకి విషయాన్ని చెప్పారు. అత్యాచారం జరిగిన విషయం బయటకి తెలిస్తే కుటుంబ పరువుపోతుందని ఆలోచించిన బాధిత కుటుంబ సభ్యులు తొలుత ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. 

స్థానికులు ధైర్యం చెప్పడంతో ఫిర్యాదు

ఈ నోటా ఆ నోటా విషయాన్ని తెలుసుకున్న ఐసిడిఎస్, చెల్డ్ లైన్ అధికారులు వాళ్ల ఇంటికి వెళ్లి విచారించగా అలాంటిదేమీ లేదని బుకాయించారు. అధికారులు వచ్చి ఆరా తీస్తున్నారని గ్రహించిన యువకులు స్థానిక పెద్ద మనుషుల ద్వారా రాజీ ప్రయత్నాలు చేశారు. పోలీసులు కూడా ఘటనపై ఆరా తీశారు. అందరూ ధైర్యం చెప్పడంతో  బాధిత కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసులకి ఫిర్యాదు చేశారు. 

పోలీసులతో మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటున్న ఎమ్మెల్యే శిరీష్ 

బాలికలపై అత్యాచార సమాచారం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా తక్షణం స్పందించారు. స్టేషన్‌ సిఐ మోహన్‌రావు, జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డితో శిరీష మాట్లాడారు. అత్యాచార బాధితులకు చట్టం పరిధిలో న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన ఎంతగానో బాధించిందన్నారు. కారకులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి మత్తులో యువకులు వికృత చేష్టలకి పాల్పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినా సెటిల్‌మెంట్లు చేశారని ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేదన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించామన్నారు. ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తెప్పవని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శిరీష.

అందుకే ఫిర్యాదు చేయలేదంటున్న బాధిత కుటుంబం

శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉండేదని ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే భయమేస్తోందని కొందరు తల్లిదండ్రులు అంటున్నారు. ఇలాంటి అరాచకాలు ఎన్నో జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఘటనలు రిపీట్ అవుతున్నాయన్నారు. కఠిన శిక్షలు పడటం లేదన్న కారణంతోనే తాము కూడా బయటకు రాకూడదని అనుకున్నామన్నారు బాధిత కుటుంబం. 

Also Read: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Embed widget