అన్వేషించండి

Crime News: బావిలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి- అన్నమయ్య జిల్లాలో ఘటన

Annamayya Road Accident News | అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బావిలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు చనిపోగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

Andhra Pradesh News | పీలేరు: అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు మండలంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన కారును, చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముగ్గురు మృతి, ఇద్దరు సేఫ్

అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలం వారి పల్లి గ్రామం కురవపల్లి దగ్గర ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో 5 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు, మరో ముగ్గురు నీళ్లలో మునిగిపోయి మృతి చెందారు 


Crime News: బావిలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి- అన్నమయ్య జిల్లాలో ఘటన

కర్ణాటక రాష్ట్రం చింతామణి తాండుపల్లికి చెందిన సునీల్, తిప్పారెడ్డి, లోకేష్, గంగులయ్య, శివన్న ఐదుగురు బృందం  వీరు చింతామణి నుండి పీలేరుకు వంట పనికి కారులో వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కారు బావిలో పడటంతో లోకేష్, గంగులయ్య, శివన్న నీళ్లలో మునిగిపోయి మృతిచెందారు. తిప్పారెడ్డి, సునీల్ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది.  


Crime News: బావిలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి- అన్నమయ్య జిల్లాలో ఘటన

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ క్రేన్ సహాయంతో బావిలో పడిన కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. కారు బావిలో పడిపోయిన విషయం తెలియగానే గ్రామస్తులు, స్థానికులు ప్రమాదం జరిగిన కురవపల్లి బావి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొందరు స్థానికులు సహాయక చర్యలలో భాగంగా బావిలోకి దిగి పోలీసులకు సాయం చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget