అన్వేషించండి

Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే ఆశ్రమంలోనే స్వామీజీ హత్య - కరీంనగర్ జిల్లాలో కలకలం

Swamiji Murder Case: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమానికి చెందిన నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60) హత్యకు గురయ్యారు.

Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే స్వామీజీనే హత్య చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమానికి చెందిన నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60) హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీ ఎన్నో సంవత్సరాల క్రితం హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఆశ్రమం ఏర్పాటు చేసి అందులోనే నివసిస్తున్నారు.

స్వామీజీ చెప్పే విషయాలు జరుగుతాయని.. నిత్యం భక్తులు ఆయనను కలిసి తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్ధిక సమస్యలు చెప్పి పరిష్కరించుకుంటారని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో  వరంగల్ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి పది రోజుల క్రితం తమ ఇంటికి సంబంధించిన  సమస్య ఉందని స్వామీజీని ఆశ్రయించాడు. శివ మాటలు నమ్మిన స్వామీజీ అతడి సమస్యను విన్నారు. అక్కడకు  వచ్చి స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్దన్న స్వామిని కోరారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వరంగల్ జిల్లాకు స్వామి వెళ్లి వచ్చారని సమాచారం. 

మూడు రోజుల క్రితం శివ తన స్నేహితుడు నీలం శ్రీనివాసుని వెంట తీసుకొని ఆశ్రమానికి వచ్చి కరీంనగర్ లోనే కాస్త పని ఉందని చెప్పాడు. పట్టణంలో ఎవరూ పరిచయస్తులు లేకపోవడంతో ఒక్కరోజు కోసం ఆశ్రమంలో తల దాచుకుంటామని స్వామిని సంప్రదించారు. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు సమస్యకు సంబంధించిన విషయాలపై చర్చించారు. స్వామి అతని డ్రైవర్ సతీష్ తో కలిసి ఆదివారం ఉదయం బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. వరంగల్ నుండి వచ్చిన ఆ ఇద్దరిని ఇంకా వెళ్లలేదని ప్రశ్నించారు. సమయం మించిపోయింది కనుక ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉండి ఉదయం వెళ్తామని వారు స్వామీజీకి సమాధానం చెప్పారు. 

సోమవారం ఉదయం స్వామికి వరుసకు అల్లుడు అయిన సతీష్ ఆలయం శుభ్రం చేయడానికి వెళ్లి స్వామి గది వద్దకు వెళ్లి పిలవడంతో ఆయన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ స్వామిజీ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చే చూసే సరికి స్వామి అప్పటికే చనిపోయి ఉన్నారు. రాత్రి స్వామి ఆశ్రమంలో పడుకున్న గదిలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి గొంతుకు తాడు బిగించి ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, మృతుని కుమారుడు చిలుపూరి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి కర్ణాకర్ రావు, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డిలు పరిశీలించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు  తెలిపారు.



టాప్ హెడ్ లైన్స్

Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget