అన్వేషించండి

మహారాష్ట్ర టు జగ్గయ్య పేట- పిల్లల అమ్మకాల్లో మైండ్‌ బ్లాంక్‌ అయ్యే కోణాలు

మహారాష్ట్ర పిల్లల కిడ్నాప్ కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జగ్గయ్యపేటలో ముఠా అరెస్టుతో హైదరాబాద్‌ వరకు పాకిందీ దందా

మహరాష్ట్రలో అదృశ్యమైన బాలుడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దొరికిన కేసులో కూపీ లాగిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్‌ అయిన పగడాల శ్రావణి, శిల్ప ఇచ్చిన సమాచారంతో కేసులో మరిన్ని కోణాలను పోలీసులు వెలికితీశారు. మరో ముగ్గురు పిల్లలను కూడా అమ్మేసినట్టు తేలింది. ఈ ముఠా స్కేచ్‌లు విన్న పోలీసులకే మైండ్‌ బ్లాంక్ అయింది. 

సంతానం లేని దంపతులు, లోపాలు ఉన్న సంతానం కలిగిన తల్లిదండ్రులే టార్గెట్‌గా ఈ ముఠా వ్యాపారం చేసింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలలో నలుగురు పిల్లలను పోలీసలు గుర్తించారు. వారిని తీసుకొచ్చి అసలు తల్లిదండ్రులకు అప్పగించారు.  

హైదరాబాద్‌లోని ఐవీఎఫ్‌ సెంటర్‌లకు ఎగ్‌ డోనర్‌ ఏజెంట్‌గా పని చేస్తోంది శ్రావణి, గుజరాత్‌కు చెందిన రంజిత అలియాస్‌ సుల్తానాతో కలిసి ఈ దందా సాగిస్తోంది.  ఆమె సికింద్రాబాద్‌లో ఉంటున్న సుల్తానా, నూర్జాహాన్, షమీరాతో కలిసి ముఠాగా ఏర్పడి పిల్లలను విక్రయించేవాళ్లు. 

ఈ ముఠా విక్రయించిన పిల్లలను పోలీసులు వెతికి పట్టుకున్నారు. బ్రాహ్మణ బజారులో ఉంటున్న జయలక్ష్మి అనే మహిళ కు ఓ బాలుడిని అమ్మారు. ఇంకో వ్యవసాయ కుటుంబానికి మరో బాలుడిని అమ్మారు. వాళ్లకు ఉన్న సంతానం మానసిక వికలాంగులు కావడంతో వాళ్లకు ఓ బిడ్డను అమ్మారు. మరో ఫ్యామిలీలో అంతా ఆడపిల్లలనే అన్న కారణంతో మరో బిడ్డను కొనుగోలు చేసింది.

పిల్లల విక్రయంలో ఈ ముఠా చాలా తెలివిగా వ్యవహరించింది. వారి వారి కొనుగోలు శక్తిని బట్టి పిల్లలను విక్రయించే వాళ్లు. రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పిల్లలను అమ్మేవాళ్లు.  ఇలా అమ్మేటప్పుడు కొనేవాళ్లకు అనుమానం రాకుండా ఉండేలా... రకరకాల కారణాలు చెప్పేవాళ్లు. తల్లిదండ్రులు చనిపోయారని... సంతానం ఎక్కువై పెంచలేకపోతున్నారని మరికొందరికి చెప్పేవాళ్లు. 

మహారాష్ట్రలోని పర్బానీలో చిన్నారుల కిడ్నాప్‌లు ఎక్కువ ఉండటంతో అక్కడి పోలీసులకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతోందని నిఘా పెట్టారు. దీంతో తీగ లాగితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో  డొంక కదిలింది.

ఇలా దొరికారు

ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడు ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జగ్గయ్యపేట ప్రాంతంలోని దేవుపాలెం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేట్ స్కూలులో ప్రస్తుతం ఆ బాలుడు చదువుతున్నాడు. ముంబయిలో 2022లో బాలుడు కిడ్నాప్‌కు గురైనట్లుగా కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అక్కడ పోలీసులకు విజయవాడకు చెందిన మహిళ బాలుడిని తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఆమె బాలుడిని జగయ్యపేటలోని ఓ మహిళకు 2లక్ష్లల రూపాయలకు అమ్మేసింది. ఆమె దేవుపాలెంలోని తమ బంధువులకు మూడు లక్షల రూపాయలకు బాలుడిని ఇచ్చేసింది. 

అప్పటి నుంచి అదే కుటుంబంలో పెరుగుతున్న ఆ బాలుడు జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అంతా వారి పిల్లాడే అనుకుంటున్న టైంలో పోలీసులు వచ్చి ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన ఫ్యామిలీ బిడ్డగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

పాఠశాల వార్షికోత్సవంలో సందడి చేస్తున్న సదరు బాలుడిని పోలీసులు గుర్తించి తీసుకెళ్లారు. ఆధారాలతో పోల్చి చూశారు. మహారాష్ట్ర పోలీసులు, స్థానిక పోలీసులు మాట్లాడుకొని గతంలో కిడ్నాప్ అయిన బాలుడు ఈ బాలుడు ఒక్కడే అని నిర్దారణకు వచ్చారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఎస్ఐ రామారావు సహకారంతో మహారాష్ట్ర పోలీసులు కేసు పత్రాలు చూపించి, బాలుడిని తీసుకెళ్లిపోయారు. 

ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడిని హఠాత్తుగా పోలీసులు తీసుకువెళ్ళిపోవటంతో పెంచుకున్న తల్లి, కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఈ వ్యవహరం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కిడ్నాప్ చేసిన విజయవాడకు చెందిన మహిళ శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లను విచారించడంతో బాలుడి ఆచూకీ లభించిందని, పూర్తి సమాచారం సేకరించి, కేసుకు సంబందించిన ఎఫ్ఐఆర్ పత్రాలు, ఇతర వివరాలు తెలుసుకొన్న తరువాతే బాలుడిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget